Tag Archives: crime

వీళ్లు మామూలు దొంగలు కాదు.. నిలబడినట్టే నిలబడి 6లక్షలు దోచేశారు..

దొంగతనం ఎప్పుడైనా జరగొచ్చు.. ఎవరైనా చేసేయొచ్చు. జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత.. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా.. ఇదిగో ఇలా దోచేస్తారు దొంగలు.. తాజాగా.. ఆదిలాబాద్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు.. బేల మండల కేంద్రంలో ఉన్న శ్రీకర్‌ మార్ట్‌లో పట్టపగలే భారీగా చోరీ చేశారు.. రూ.5.87లక్షలు నగదు ఉన్న సంచిని అందరి ముందే.. గుట్టుగా చోరీ చేసి పరారయ్యారు.. అయితే, చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.. డబ్బు ఉన్న సంచిని చోరీ చేసిన ఇద్దరు యువకులు.. ఎవరూ చూడని సమయంలో …

Read More »

ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌

ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్యలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హరీష్ ఆత్మహత్య ఘటనలో యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి అనుకోకుండా ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. కొంతకాలానికి యువతి బ్యాగ్రౌండ్ వెరిఫై చేయగా.. తను వేరే వాళ్లతో చనవుగా ఉన్నట్లు హరీష్ గుర్తించాడు. దీంతో తన ప్రవర్తన నచ్చక దూరంపెట్టాడు ఎస్సై. ఆపై …

Read More »

స్వర్ణ దేవాలయంలో కాల్పుల కలకలం.. బాదల్‌పై దాడి చేసిన నారాయణ్‌సింగ్ చౌరా ఎవరో తెలుసా..?

శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్‌పై పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బుధవారం (డిసెంబర్ 4) దాడి జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో సుఖ్‌బీర్ బాదల్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో సేవ చేస్తుండగా ఓ వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు కాల్పులు జరుపుతున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సుఖ్‌బీర్ బాదల్ క్షేమంగా బయటపడ్డారు. అయితే అకాలీదళ్ నాయకుడు ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. గురుద్వారాలో శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ ఇచ్చిన మతపరమైన …

Read More »

ప్రాణాలు తీస్తున్న ట్రావెల్స్ బస్సులు.. రెప్పపాటులో ఘోరం.. ఆటోలో వెళ్తుండగా..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అడ్డదిడ్డంగా బస్సులు నడుపుతూ ఎక్కడి పడితే అక్కడ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.. గమ్యస్థానాలకు తొందరగా వెళ్లాలనే ఆత్రుతో లేక ప్రమాదం జరిగితే మాకేమవుతుందిలే అనే అహంకారమో.. తెలియదు గానీ బస్ డ్రైవర్లు అధిక స్పీడ్‌తో బస్సులను నడిపి ఆటోలను ద్విచక్ర వాహనాలను గుద్దేసుకుంటూ నిత్యం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. తాజాగా ఓ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిడిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పోరుమామిళ్ల కాలువ కట్ట సమీపంలో ఆటోను …

Read More »

మరో పరువు హత్య.. కానిస్టేబుల్‌ను దారుణంగా నరికి చంపిన తమ్ముడు..

తమ్ముడి కుల కావరానికి లేడీ కానిస్టేబుల్‌ బలైపోయింది. కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కనే చంపేశాడు తమ్ముడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ పరువు హత్య తెలంగాణ కలకలం రేపుతోంది.. కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని కానిస్టేబుల్‌ నాగమణిని తమ్ముడు పరమేష్‌ నరికి చంపాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జరిగింది. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి.. సోమవారం ఉదయాన్నే స్వగ్రామం రాయపోలు నుంచి హయత్‌నగర్‌ బయల్దేరింది.. ఈ క్రమంలో నాగమణి కోసం దారికాచిన తమ్ముడు …

Read More »

మద్యం మత్తులో నిత్యం భార్యకు నరకం చూపించిన భర్త.. చివరికి ఏం చేసిందో తెలుసా?

వైరా మండల విద్యా శాఖలో రెబ్బవరం క్లస్టర్ సీఆర్పీగా రవి పని చేశారు. అతను ప్రతి రోజూ మద్యం సేవించి విధులకు హాజరవుతుండటం, ఎన్నిసార్లు మందలించినా.. అతని తీరు మారలేదు.భర్త వేధింపులు తట్టుకోలేక విసిగి వేసారిన భార్య తెగించింది. అందరు చూస్తుండగానే భర్తపై కత్తితో దాడి చేసింది. అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే …

Read More »

Secunderabad Serial killer: సికింద్రాబాద్ సీరియల్‌ కిల్లర్‌.. వెలుగులోకి ఒళ్లు గగుర్పోడిచే విషయాలు

ఒంటరి మహిళలు రైల్లో ప్రయాణం చేస్తున్నారా అయితే అలెర్టగా ఉండండి. ట్రైన్‌లలో ఒంటరిగా ఉన్న మహిళలే అతడి లక్ష్యం.. గొంతు నులిమి చంపి ఒంటి మీద ఉన్న బంగారు నగలు దోచుకెళ్ళడం అతడి నైజాం.. అతడో సైకో కిల్లర్.. తన వైకల్యాన్ని అవకాశంగా మలచుకొని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు తెగబడ్డాడు.. జైలు నుంచి విడుదలైన 11 రోజుల్లోనే 5 హత్యలకు పాల్పడినట్టు గుజరాత్ పోలీసులు నిర్దారించారు. హరియాణాకు చెందిన రాహుల్ జాట్ అలియాస్ భోలు కర్మవీర్ ఈశ్వర్ జాట్ (29) ఆరాచకానికి కర్ణాటక …

Read More »

బాబోయ్‌ దండుపాళ్యెం క్రైం సీన్‌! అద్దెల్లు కోసం వచ్చి.. కళ్లల్లో కారం కొట్టి.. 

ఇల్లు అద్దెకు కావాలని ఓ జంట ఓ భవంతి ముందు నిలబడ్డారు. ఇంతలో ఇంటి యజమానులు రావడంతో ఎంతో కలుపుగోలుగా మాట్లాడారు. దీంతో ఇంటిని అద్దెకు ఇవ్వడానికి యజమానులు అంగీకరించారు. అదే వాళ్ల ప్రాణానికి హాని తలపెట్టింది. వచ్చిన కొత్త మనుషులు అదే రోజు రాత్రి మళ్లీ వచ్చారు. యజమాని ఇంట్లో భోజనం చేసి, దంపతును ఘోరంగా హత్య చేశారు. ఈ జంట హత్యలు ఖమ్మం జిల్లాలో బుధవారం (నవంబర్‌ 27) ఉదయం వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నివసిస్తున్న ఎర్రా …

Read More »

ప్రియురాలితో సహా-జీవనం.. చేసిన తప్పును కప్పపుచ్చుకునేందుకు 40ముక్కలుగా నరికేసిన ప్రియుడు..!

ఇద్దరూ ఏడాదిన్నర పాటు లివ్-ఇన్-రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఏడాదిన్నర పాటు సహజీవనం చేసిన గంగి తమిళనాడుకు పనికి వెళ్లగా, నరేష్ బెంగళూరుకు వచ్చి జీవించడం ప్రారంభించాడు.జార్ఖండ్‌లో దారుణం వెలుగుచూసింది. రాంచీలో లైవ్-ఇన్ పార్టనర్ హత్య కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు తన ప్రియురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆపై కండువాతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. పట్టుబడకుండా ఉండేందుకు మృతదేహాన్ని 40 ముక్కలుగా నరికేశాడు. ముక్కలను సంచిలో తీసుకువెళ్లి అడవిలో పాతిపెట్టాడు. ఇక అక్కడి నుంచి గుట్టుచప్పుడు …

Read More »

మనిషి కాదు పశువు, అశ్లీల వీడియోలకు బానిస.. కోల్‌కతా నిందితుడిపై సీబీఐ అధికారి

RG Kar Hospital: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు జరిపిన విచారణకు సంబంధించి కోల్‌కతా పోలీసులతోపాటు సీబీఐ అధికారులు కూడా సుప్రీంకోర్టులో వేర్వేరుగా స్టేటస్ రిపోర్టులు సమర్పించారు. ఈ కేసు విచారణను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, కోల్‌కతా పోలీసులు.. నివేదిక అందించారు. మరోవైపు.. ఈ కేసులో విచారణ జరుపుతున్న ఓ సీబీఐ అధికారి.. నిందితుడు సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. …

Read More »