విశాఖ సింహాచలం అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణను ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా సింహాచలం గోవింద నామ స్మరణతో మారుమోగుతోంది. గిరిప్రదక్షిణ సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గిరిప్రదక్షిణలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. తొలిపావంచా దగ్గర ప్రారంభమైన …
Read More »Tag Archives: giri pradakshina
సింహాచలంలో నేడు గిరి ప్రదక్షిణ మహోత్సవం
సింహాచలం, న్యూస్టుడే: శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో శనివారం గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు.
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal