శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ బాలుడి దవడలో బ్రష్ గుచ్చుకుంది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో 11 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే బాలుడు ఉదయాన్నే లేచి పళ్ళు తోముతున్నాడు.. ఆ సమయంలో బాలుడు కిందపడటంతో బ్రష్లోని పదునైన భాగం దవడలోకి చొచ్చుకుపోయింది. బ్రష్ దవడలో అలాగే ఇరుక్కుపోగా.. వెంటనే తల్లిదండ్రుల్ని బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాలుడికి ఆపరేషన్ చేసి బ్రష్ను తొలగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.. బాలుడికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal