గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పానీపురం బండి నిర్వహించే వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా రాష్ట్రపతి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను పంపించారు. ఆగస్టు 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. తెనాలి బాలాజీరావుపేటకు చెందిన మెఘావత్ చిరంజీవి.. రైల్వే స్టేషన్ వీధిలో పానీ పూరి అమ్ముతున్నారు. ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకునేవారు. ఆ తర్వాత ఆయన తన ఆలోచనను మార్చుకున్నారు. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద మెప్మా రుణం …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal