గత రెండు రోజులుగా అన్నమయ్య జిల్లా రాయచోటి లోని కొత్తపల్లి ప్రాంత ప్రజలు హడలెత్తిపోతున్నారు. వారి మధ్య మామూలుగా తిరిగిన ఇద్దరు మనుషులు ఉగ్రవాదులు అని తెలిసేసరికి స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గత రెండు రోజుల క్రితం ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకోవడంతో టెర్రరిస్టుల ఉనికి బయటపడింది.అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ప్రాంతంలో ఉగ్రమూకల కదలికలను గుర్తించిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal