కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు

పీసీ ఘోష్‌ నివేదికపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని.. పబ్లిక్‌ డొమైన్‌లో నివేదిక ఉంటే తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కేసీఆర్‌, హరీష్ రావు‌ పిటిషన్లపై రెండో రోజు వాదనలు కొనసాగాయి. నివేదిక ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు… నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా.. అసెంబ్లీలో పెట్టాక చర్యలు తీసుకుంటారా అని నిన్న హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై తదుపరి చర్యలకు సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు సమర్పించారు అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు AG. కేసీఆర్‌, హరీష్‌ ఇద్దరూ ఎమ్మెల్యేలే కాబట్టి నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలన్నారు.

About Kadam

Check Also

ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్ వేటు వేయడానికి కారణాలు ఇవేనా..?

అనుకున్నంతా అయ్యింది… బీఆర్‌ఎస్‌లో కవిత ప్రస్థానం ముగిసింది. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఆమె వ్యవహరిస్తున్న తీరును.. ఇక ఎంతమాత్రం ఉపేక్షించని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *