శ్రీవారి భక్తులకు అలెర్ట్.. 7 రోజుల పాటు ఈ సేవలు రద్దు..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలిపిరిలో జరిగే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 13 వరకు, మొత్తం ఏడు రోజుల పాటు ఈ హోమం కోసం ఆన్‌లైన్ టికెట్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలియజేసింది.

హోమం జరిగే ప్రదేశంలో కొన్ని నవనీకరణ పనులు, అలాగే అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం అవసరం. ఈ పనులు జరుగుతున్న కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఈ ఏడు రోజుల పాటు హోమం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవు.

అయితే, హోమాన్ని పూర్తిగా నిలిపివేయడం లేదు. ఈ ఏడు రోజులు హోమంను మరోచోట ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా ఆన్ లైన్ లో టికెట్లు లభించవు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని టీటీడీ విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్ నెలలోని ఇతర రోజులలో, విశేష హోమం టికెట్లు ఆన్‌లైన్‌లో యథావిధిగా అందుబాటులో ఉంటాయి. భక్తుల సహకారం కోరుతున్నారు.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *