11వ అంతర్జాతీయ యోగాడే రికార్డు నెలకొల్పబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. 12 లక్షల ప్రాంతాల్లో ఇవాళ యోగా చేస్తున్నారన్నారు. అలాగే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది యోగా చేస్తున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయన్నారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంతో రికార్డు సృష్టించినట్టు చెప్పారు. నిన్న 22వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారన్నారు. ప్రతిరోజూ గంటసేపు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని.. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయన్నారు సీఎం చంద్రబాబు.
