ఏపీలోని ఆ స్టేషన్‌లో కూడా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలుకు స్టాప్!

ఏపీలోని మరో రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఆగనుంది. ఈ మేరకు వందేభారత్‌ హాల్ట్‌కు రైల్వే సహాయ మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి దుర్గ్-విశాఖపట్నం మధ్య వందేభారత్‌ రైలు పట్టాలెక్కబోతోంది. అయితే పార్వతీపురంలో స్టాప్‌ లేకుండానే రైల్వే అధికారులు ఈ వందేభారత్ రైలు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. అయితే ఈ రైలుకు పార్వతీపురం, టౌన్‌ రైల్వే స్టేషన్‌ల్లో నిలుపలేదు. వెంటనే స్పందించిన పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర విశాఖపట్నంలోని డీఆర్‌ఎంతో పాటుగా అధికారులను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అంతేకాదు రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్నను బెంగళూర్‌లో కలిసి సమస్యను వివరించారు. దీంతో పార్వతీపురంలో వందేభారత్‌ హాల్ట్‌పై రైల్వే సహాయ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అదే జరిగితే పార్వతీపురంలో కూడా వందేభారత్ రైలు ఆగనుంది.

About amaravatinews

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *