తిరుపతి లడ్డూ వివాదంపై బండి సంజయ్ ఘాటు స్పందన.. చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్

దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డూకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే.. ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూపై నిన్న(సెప్టెంబర్ 18న) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఆందోళన రేకెత్తించటంతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతి లడ్డూ ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపి.. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందంటూ చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలు ఇప్పుడు ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ అగ్గి రాజేస్తున్నాయి. కాగా.. ఈ ఆరోపణలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు.

దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల దేవస్థానం లడ్డూ తయారీలో చేప నూనె, బీఫ్ లాటో, పామాయిల్, పంది కొవ్వు నూనెను ఉపయోగించటమనేది.. హిందువలు విశ్వాసానికి తీవ్ర ద్రోహం చేసినట్టేనని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమలలో నాస్తికులను ఉద్యోగులుగా, టీటీడీ బోర్డులోకి అనుమతించడం వల్ల హిందువుల విశ్వాసాలపై అగౌరవం ఏర్పడుతుందని గతంలో తాము ఆందోళనలు చేసినట్టుగా బండి సంజయ్ గుర్తు చేశారు.

ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తక్షణమే పూర్తి విచారణ జరిపి.. నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని బండి సంజయ్ కోరారు. ఇలాంటి పనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని సీఎం చంద్రబాబును బండి సంజయ్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు.. ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ పోస్ట్ పెట్టారు.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *