పోలవరం నిధులపై ఏపీకి కేంద్రం శుభవార్త.. ఎన్నాకెన్నాళ్లకు.. ఆ బకాయిలు సహా అడ్వాన్సు

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం తీపి కబురు అందించింది. ప్రాజెక్ట్ కోసం రూ.2,800 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే, ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద విడుదల చేసిందో స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది. పాత బకాయిల రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.800 కోట్లు, పనులు చేపట్టేందుకు అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు విడుదల చేసినట్టు ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణ పనులను రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. ముందుగా నిధులు ఖర్చుచేసి పనులు చేయిస్తే, ఆ బిల్లులు పంపించిన తర్వాత వాటిని కేంద్రం పరిశీలించి, దశల వారీగా నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.30,436 కోట్లతో ప్రాజెక్టు కొత్త డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఆమోదం తెలిపింది. దీంతో గతంలో ఇచ్చిన నిధులు పోనూ రూ.12,157 కోట్లు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు అవకాశం కలిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.7 వేల కోట్ల వరకు అవసరమని అధికారులు చెబుతున్నారు.

About amaravatinews

Check Also

గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? వీళ్లు ఏం చేశారో తెలిస్తే మీ గుండె గుభేలే..

అనంతపురం జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల గోల్డ్‌ లోన్‌ మోసాలు కలకలం రేపుతున్నాయి. జల్సాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *