ఉచిత రేషన్ పరిధిని పెంచిన మోదీ సర్కార్.. దాని ప్రయోజనం ఎలా, ఎవరికి లభిస్తుందో తెలుసా!

భారత ప్రభుత్వం పేద ప్రజల కోసం వివిధ రకాల పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ఈ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. వివిధ వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పథకాలు తీసుకువస్తోంది. భారతదేశంలో ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఆకలితో పస్తులు ఉండకూడదన్న లక్ష్యంతో మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఉచిత రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది.

కడుపు నిండా తిండి లేనివారి ప్రభుత్వం సహాయం అందజేస్తుంది. అలాంటి వారి కోసం ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. కరోనా కాలంలో, భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రారంభించింది. దీని కింద దేశంలోని కోట్లాది మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఈ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉచిత రేషన్ పథకం 5 సంవత్సరాలు పొడిగింపు

కరోనా కాలంలో భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రారంభించింది. దీని కింద ప్రతి పేద నిరుపేదకు 5 కిలోల వరకు ఉచితంగా రేషన్ అందజేస్తారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను జనవరి 1, 2024 నుండి వచ్చే ఐదేళ్ల పాటు పొడిగించింది. దీని వల్ల దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందనున్నారు.

About amaravatinews

Check Also

కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. జర జాగ్రత్త..! రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..

కనుమరుగై పోయిందనుకుంటున్న వేళ కరోనా రీ ఎంట్రీ మళ్లీ కలకలం రేపుతోంది. కొత్త రూపంలో పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *