విశాఖలో ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా.. పోలీసులు డోర్ తీయగానే, అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోయారు

విశాఖపట్నంలో సరికొత్త దందా బయటపడింది. నగరంలో కాస్మొటిక్స్‌ అమ్మకాల ముసుగులో ఆన్‌లైన్‌ బెట్టింగ్, ఇతర ఆన్‌లైన్‌ మోసాలు చేస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు పోలీసులు. ఓ అపార్ట్‌మెంట్ కేంద్రంగా ఈ తతంగం మొత్తం నడుస్తుండగా.. విశాఖ సైబర్‌ క్రైమ్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ గ్యాంగ్ చైనా కేంద్రంగా నడిచే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.. మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు.

పోలీసులు చెబుతున్న వివరాల ఇలా ఉన్నాయి.. విశాఖపట్నంకు చెందిన సూర్యమోహన్‌ హాంకాంగ్, తైవాన్‌‌కు వెళ్లొచ్చారు. అనంతరం నగరానికి చెందిన సాయిరామ్, గిరిష్‌లతో పరిచయం అయ్యింది. ఈ ముగ్గురిలో సాయిరామ్‌కు సైబర్‌ కేటుగాళ్లకు లింక్ ఉంది.. వారికి బ్యాంకు అకౌంట్‌లను సమకూర్చిన అనుభవం ఉంది. ఈ ముగ్గురు నగరంలోనే ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని.. తాము కాస్మొటిక్‌ను వియత్నాంకు ఎగుమతులు చేస్తున్నట్లు అందరినీ నమ్మించారు. ఆ ఫ్లాట్‌లో కాల్‌సెంటర్‌ తరహాలో ఓ ఆఫీస్‌ను ఏర్పాటు చేసి విశాఖ కేంద్రంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.

ఈ బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన డబ్బుల్ని అనధికార గేట్వేల ద్వారా చైనా సంస్థలకు బదిలీ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫ్లాట్‌లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో షిప్టుల విధానంలో ఆరుగురు యువతులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. విశాలాక్షినగర్‌లో నగదు లావాదేవీల కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ముగ్గురు బెట్టింగ్‌ సొమ్ము చెల్లింపులకు టీఆర్‌ఎక్స్‌ పేమెంట్ గేట్వేను ఉపయోగించారు. ఈ బెట్టింగ్ వ్యవహారంపై సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేసి ప్రధాన నిందితులు ముగ్గురు సహా మొత్తం ఏడుగుర్ని అరెస్ట్ చేశారు.

About amaravatinews

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *