ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెల 1 నుంచి పక్కా, నాలుగు రకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డులు ఉన్నవారికి వచ్చే నెల నుంచి నాలుగు రకాల సరుకుల్ని అందజేయనుంది. వచ్చే నెల నుంచి నాలుగు రకాల సరకులు తెల్లరేషన్‌ కార్డుదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సరుకులు చేరగా.. బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. ఈ సరుకుల్ని కచ్చితమైన తూకాలు, నాణ్యమైనవి సరఫరా చేయనున్నారు. అక్టోబరు నెలలో 50 శాతానికిపైగా కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయగా.. నవంబరులో ప్రతి కుటుంబానికి నాలుగు వస్తువులు అందించబోతున్నారు.

నవంబరులో రేషన్‌కార్డుదారులకు నాలుగు రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. రేషన్ షాపుల్లో బియ్యం బదులు జొన్నలు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున జొన్నలు ఇవ్వనున్నారు.. నాణ్యమైన సరుకుల్ని డీలర్లకు సరఫరా చేస్తున్నారు. కానీ 35 శాతానికిపైగా డీలర్లు జొన్నలు తీసుకెళ్లలేదంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్పటికే సరుకుల్ని తరలించారు. అంతేకాదు నవంబరు నుంచి ప్రభుత్వం కందిపప్పు కిలో రూ.67 చొప్పున అందించనున్నారు. ఏఏవై కార్డుదారులకు పంచదార కిలో రూ.14, మిగిలిన కార్డుదారులకు అర కిలో రూ.17 చొప్పున అందిస్తారు.

దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు చిరుధాన్యాల వంటకాలు తినేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ప్రభుత్వం జొన్నలు, రాగులు, సజ్జలను క్రమంగా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తోంది. నవంబరులో జొన్నల పంపిణీకి సిద్ధంకాగా.. బియ్యం వద్దనుకుంటే ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున జొన్నలు అందిస్తారు. బియ్యం, పంచదార యథావిధిగా పంపిణీ చేస్తారు.. కార్డుదారులకు బియ్యం, పంచదారతోపాటు కందిపప్పు, జొన్నలు పంపిణీ చేస్తారు.

మరోవైపు ప్రభుత్వం దసరా సమయంలో వంటనూనెల్ని తక్కువ ధరకు సరఫరా చేసింది. పామోలిన్‌ లీటరు (850 గ్రాములు) రూ.110, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించారు. ఒక్కో రేషన్‌ కార్డుపై మూడు లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ చొప్పున పంపిణీ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో వంటనూనెల్ని పంపిణీ చేసింది.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *