ఏపీలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త.. 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్‌లు తీసుకునేవారికి తీపికబురు చెప్పింది. ఇప్పటి వరకు నెలకు ఒకసారి అందిస్తున్న పింఛన్‌ను.. ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చని ప్రకటించారు. పింఛన్ తీసుకోవడం ప్రజల హక్కని, ప్రభుత్వం దీనిని ఇంటి దగ్గరే గౌరవంగా అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో రెండు నెలలు పింఛన్ తీసుకోకపోతే మూడో నెల కలిపి తీసుకోవచ్చని చెప్పారు.స్వేచ్ఛగా తీసుకోవచ్చు.. ఏ బాధలేదన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడతాం.. ఇస్తామని చెప్పాం.. ఆదేశాలు ఇచ్చాను.. ఇవ్వకపోతే నిలదీయండి తీసుకోండి అది వారి హక్కు అన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు.

అర్హులకు పింఛన్ ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత.. తీసుకోవడం లబ్ధిదారుల బాధ్యత అన్నారు చంద్రబాబు. సచివాలయ సిబ్బంది ఎవరైనా సరే ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వకపోతే ఆఫీస్ దగ్గర ఇస్తే ఊరుకోను అన్నారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లాలి .. గౌరవంగా పింఛన్ ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది బాగా పని చేస్తున్నారు వారిని అభినందిస్తున్నానని.. ఒకరిద్దరి వల్ల చెడ్డపేరు వస్తోంది.. దానిని కూడా సరి చేసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది పింఛన్‌ల పంపిణీని మానిటర్ చేస్తున్నామని.. ఆర్టీజీఎస్ ద్వారా ఏ తప్పు చేసినా తెలిసిపోతుందన్నారు. అలాగే రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్‌లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై కార్యాచరణ రూపొందిస్తామని.. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలో రూ.10.50 లక్షల కోట్ల అప్పు పేరుకుపోయిందన్నారు ముఖ్యమంత్రి. ఏటా రూ.లక్ష కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందని.. ఎక్కడికెళ్లినా అప్పు కూడా పుట్టని పరిస్థితి ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై పన్ను వేశారే తప్ప చెత్త తీయలేదని.. దీంతో 85 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోయింది అన్నారు. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వంలోని తప్పుల్ని సరిచేసే పనిలో ఉన్నామన్నారు.

ఏపీ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు ఇస్తామని తెలిపింది. ఈ నెల నుంచి కొత్త పింఛన్‌లకు దరఖాస్తులు స్వీకరించి.. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని చెబుతోంది. అనర్హులు ఉంటే వాటిని తొలగిస్తామని.. ఇవన్నీ గ్రామ సభల్లో అందరి సమక్షంలోనే జరుగుతుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో దరఖాస్తుల్ని పరిశీలించి.. జనవరి నుంచి కొత్త పింఛన్‌లు ఇస్తామని చెబుతోంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్‌లను తనిఖీ చేయనుంది.. అనర్హులను ఏరివేసే పనిలో ఉంది ప్రభుత్వం. కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి విధివిదానాలను తయారు చేసే పనిలో ఉంది ప్రభుత్వం.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *