ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు కల్పిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోవాలని కోరారు విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్ (X) 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్కు శారదాపీఠం తరఫున లేఖ రాశారు. 2019 నుంచి 2024 వరకూ తన భద్రత, శ్రేయస్సు కోసం ప్రస్తుత, గత ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని.. 2019 నుంచి విశాఖపట్నంలోని శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు వైఎస్సార్సీపీ, కూటమి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇకపై రిషికేశ్లో తపస్సులోనే ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నానని.. అందుకే తనకు కేటాయించిన గన్మెన్లను వెనక్కు తీసుకోవాలని కోరారు.
విశాఖపట్నం శారదా పీఠానికి కేటాయించిన భూముల్ని కూడా ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో భీమిలి మండలం కొత్తవలస సమీపంలో కేటాయించిన 15 ఎకరాల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్ని అప్పటి ప్రభుత్వం నామమాత్రపై ధరకే కేటాయించారని.. నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భూ కేటాయింపుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. విశాఖపట్నం జిల్లా యంత్రాంగం ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది.
Amaravati News Navyandhra First Digital News Portal