తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. 

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్దేశించిన రేట్లకే వాటర్ బాటిళ్లు విక్రయించాలని జేఈవో (విద్య, ఆరోగ్యం) గౌతమి చెప్పారు. తిరుమలలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలోని దుకాణదారులు టీటీడీ నిర్దేశించిన రేట్ల కంటే అధిక రేట్లకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నారని, కాళీ గాజు బాటిళ్లు తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, తిరుమలలోని దుకాణదారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని అన్ని దుకాణాలలో ఒకే రేటుతో వాటర్ బాటిళ్లు విక్రయించాలని, కాళీ గాజు బాటిల్ తీసుకొని భక్తులకు డబ్బులు తిరిగి ఇవ్వాలన్నారు. అదేవిధంగా దుకాణదారులు తమ దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జేఈవో ఆదేశించారు. ఇందుకు దుకాణదారులు తమ అంగీకారం తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, ఇంచార్జ్ హెల్త్ అధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు, దుకాణదారులు పాల్గొన్నారు.

About amaravatinews

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *