Adani Group: రూ.2100 కోట్ల లంచం ఆరోపణ.. అమెరికాలో కేసు.. అదానీ గ్రూప్ స్పందన ఇదే!

Adani Group: రూ.2100 కోట్ల లంచం, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం వంటి ఆరోపణలతో అదానీ గ్రూప్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. సౌర విద్యుత్తు ప్రాజెక్ట్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను కొట్టిపారేసింది. తమపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధరమైనవని పేర్కొంది. అక్కడి చట్టాలకు లోబడి తమ గ్రూప్ నడుచుకుంటోందని స్పష్టం చేసింది. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించింది.

సోలార్ పవర్ ప్రాజెక్టులు పొందేందుకు అదానీ గ్రూప్ ఏకంగా రూ.2100 కోట్లు భారత అధికారులకు లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ విషయంలో గౌతమ్ అదానీ సహా మరో 7 మందిపై కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ వార్తలు వెలుగులోకి వచ్చిన క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ కుప్పకూలాయి. ఒక్కరోజులోనే లక్షల కోట్లు నష్టం వచ్చింది. రాజకీయంగానూ దుమారం రేగింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

About amaravatinews

Check Also

పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆగ్రదేశాధి నేతలు.. ట్రంప్, పుతిన్‌ సహా పలువురి స్పందన ఇదే

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పుల్వామా దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌ లోయలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *