తిరుపతిలోని హోటల్ కు మరోసారి బాంబు బెదిరింపులు..అధికార యంత్రాంగం అలర్ట్‌..

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అప్రమత్తమైన పోలీసులు అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు తరచూ ఇలా ప్రైవేటు హోటల్స్‌కు వస్తున్న ఫేక్‌ మెయిల్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు ఆగటం లేదు. తాజాగా నగరంలోని ఓ హోటల్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో కలకలం రేపింది. తిరుపతి పోలీసులకు బెదిరింపు కాల్స్‌ సవాల్‌గా మారగా, సదరు హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డిసెంబర్‌ 8ఆదివారం రోజున కపిలతీర్థం రోడ్‌లోని రాజ్‌పార్క్‌ హోటల్‌కు, మేనేజర్‌కు మెయిల్‌ ద్వారా వార్నింగ్‌ ఇచ్చారు గుర్తు తెలియని దుండగులు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అప్రమత్తమైన పోలీసులు అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు తరచూ ఇలా ప్రైవేటు హోటల్స్‌కు వస్తున్న ఫేక్‌ మెయిల్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.

About Kadam

Check Also

వంశీ కేసులో దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీసులు

– లెక్కలన్నీ తేలుస్తాం…! అందరిని బయటకు తీస్తాం..! అంటూ వల్లభనేని వంశీ కేసులో దూసుకుపోతున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌… …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *