ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా అమల్లో ఉన్న విధానానికి స్వస్తి పలికింది.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం తీసుకొచ్చింది.. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు (ఎస్సీ విద్యార్థులు మినహా) కాలేజీల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనున్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థుల హాజరు ఆధారంగా విడుదల అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఫీజుల అంశంపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తమంటున్నారు అధికారులు. 2019కి ముందు ఫీజులను కాలేజీలకు జమ చేసే విధానం ఉండగా.. గత ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది. ఈ ఫీజు రీయింబర్స్ డబ్బులు తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేశారు. అయితే కొంతమంది విద్యార్థులు ఈ విధానంతో ఇబ్బందిపడ్డారనే విమర్శలు వచ్చాయి. ఈ విధానంతో.. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల విడుదలతో తమకు సంబంధం లేదని.. ముందుగానే కట్టించుకున్న సంగతి తెలసిందే.

గత ప్రభుత్వ హయాంలో ఏటా ఫీజులు విడుదల చేయకపోయినా విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు చెల్లించిన పరిస్థితి. ఆ తర్వాత తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ఖాతాల్లో ఫీజులు జమ చేశారు. 2023-24 విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయంటోంది ప్రభుత్వం. దీంతో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు ఇబ్బందిపడ్డాయి. దీంతో చాలామంది విద్యార్థులు అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం పాత విధానం పునరుద్ధరించి ఫీజుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా..ఈ మేరకు ఇప్పుడు పాత విధానం తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కాలేజీల అకౌంట్లలోనే డబ్బుల్ని జమ చేయనున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *