ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలపై రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 54 మండలాలు కరవుబారిన పడినట్లు తెలిపారు. అలాగే మిగిలిన 21 జిల్లాల్లో కరవు పరిస్థితులు లేనట్లుగా నివేదికలు వచ్చాయని ప్రస్తావించారు. ఈ మండలాల్లో 27 చోట్ల తీవ్రంగా.. మరో 27 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ మేరకు కరువు మండలాలను నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అధిక వర్షపాతం నమోదైనా.. సగటు వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు సాధారణం కన్నా అతి తక్కువ వానలు పడ్డ మండలాలను కరువు మండలాలుగా గుర్తించింది. అనంతపురం జిల్లాలో 56.4 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 52.7 శాతం, అన్నమయ్య జిల్లాలో 46.6 శాతం, చిత్తూరు జిల్లాలో 45.4 శాతం, కర్నూలు జిల్లాలో 18.2 శాతం చొప్పున సాధారణం కంటే తక్కువ వర్షం నమోదయ్యాయని ప్రస్తావించారు. 2023 ఖరీఫ్లో 88.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. అదే 2024 ఖరీఫ్లో 93.55 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఏపీలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 114.72 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా.. 82 శాతం విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు.
చిత్తూరు జిల్లా పెనుమూరు, గుడిపాల, యాదమర్రిని తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు. చిత్తూరు జిల్లా చిత్తూరు, పూతలపట్టు, కుప్పం, రామకుప్పం సోమల, పుంగనూరు, పలమనేరు, శాంతిపురం, శ్రీరంగరాజపురం, రొంపిచర్ల, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. అనంతపురం జిల్లా నార్పల, అనంతపురం తీవ్ర కరువు మండలాలు. అనంతపురం జిల్లా విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు కరువు మండలాలుగా ప్రకటించారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల తీవ్ర కరువు మండలాలుగా.. కనగానపల్లి, ధర్మవరం, నంబులపులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగిని కరువు మండలాలుగా ప్రకటించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె, రాయచోటి, పీలేరు, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, టి.సుండుపల్లె, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె, కర్నూలు జిల్లా కౌతాళం, పెద్ద కడుబూరు కరువు మండలాలుగా ప్రకటించారు.
Amaravati News Navyandhra First Digital News Portal