ఏపీలో పింఛన్లు తీకునేవారికి అలర్ట్.. ఇకపై వాళ్లకు అకౌంట్‌లలో డబ్బులు జమ, ఎందుకంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పించన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊరికి, ఇంటికి దూరంగా.. హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటూ పింఛన్‌ తీసుకునేందుకు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. వీరి కష్టాలను గమనించిన ప్రభుత్వం.. ఆ ఇబ్బందులకు చెక్ పెట్టింది. ప్రతి నెలా వీరు పింఛన్ తీసుకునేందుకు సెలవుపెట్టి ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది.. అందుకే వారికి పింఛన్ డబ్బుల్ని బ్యాంకు అకౌంట్‌లలోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పించన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊరికి, ఇంటికి దూరంగా.. హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటూ పింఛన్‌ తీసుకునేందుకు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. వీరి కష్టాలను గమనించిన ప్రభుత్వం.. ఆ ఇబ్బందులకు చెక్ పెట్టింది. ప్రతి నెలా వీరు పింఛన్ తీసుకునేందుకు సెలవుపెట్టి ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది.. అందుకే వారికి పింఛన్ డబ్బుల్ని బ్యాంకు అకౌంట్‌లలోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద 8.50 లక్షల మంది పింఛన్లను ప్రతి నెలా తీసుకుంటున్నారు. 45 శాతం వైకల్యం పైబడిన వారికి వివిధ విభాగాల్లో వీరికి వయసుతో సంబంధం లేకుండా.. రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు ప్రభుత్వం పింఛను అందిస్తోంది. వీరిలో దాదాపుగా 10 వేల మంది విద్యార్థులు గురుకులాలు, హాస్టల్స్‌లో చదువుకుంటూ పింఛన్ తీసుకుంటున్నారని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉన్నారు.

త ప్రభుత్వంలో రెండు, మూడు నెలల పింఛన్ డబ్బుల్ని ఒకేసారి తీసుకునే వెసులుబాటును రద్దు చేశారు. దీంతో దివ్యాంగ విద్యార్థులు పింఛను తీసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు.. వ్యయ ప్రయాసలు కూడా తప్పలేదు. అప్పట్లోనే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. అందుకే అవసరమైతే విద్యార్థులు ఉండే హాస్టల్స్, గురుకులాల పరిధిలోని సచివాలయాలకు పింఛను మార్పు చేసుకోవచ్చని చెప్పారు.. కానీ ఆ దిశగా అడుగులు పడలేదంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తోంది. ఈ అకౌంట్‌లలో డబ్బులు వేసే వెసులుబాటు కేవలం దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న వారికే పరిమితం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అదీ కూడా తమకు బ్యాంకు అకౌంట్‌లలో డబ్బులు జమ చేసేందుకు సమ్మతి తెలిపిన వారికే వర్తింపజేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులను గుర్తించనున్నారు.

ఇటీవల ప్రభుత్వం పింఛన్లను బదిలీ చేసే అవకాశాన్ని కల్పించింది.. రాష్ట్రంలో అవసరమైన చోటికి పింఛన్‌ మార్చుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే పలువురు తమకు అవసరమైన చోటికి మార్చుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీని దాదాపుగా పూర్తి చేస్తోంది. ఒకవేళ ఆ నెలలో 1వ తేదీ ఆదివారం, సెలవు దినం ఉంటే ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేస్తున్నారు.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *