చంద్రబాబుకు మరో గౌరవం.. దేశ రాజకీయాల్లో శక్తివంతమైన నేతగా..

మన పెద్దోళ్లు ఎప్పుడూ ఓ మాట చెప్తూ ఉంటారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతుంటాయని.. ఎందుకంటే ఏది ఎప్పుడు జరుగుతుందో, ఎవరికి ఎప్పుడు కలిసి వస్తుందో.. ఏ జ్యోతిష్యుడు కూడా కచ్చితంగా చెప్పలేడు. ఇవాళ అట్టడుగున ఉన్నవారు.. రేపటికల్లా అందలం ఎక్కొచ్చు. కాకపోతే మనవైపు ఉండాల్సిందల్లా ప్రయత్నమే. ఆ ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తుంటే.. మనకంటూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు మనల్ని ఆపేవాడు ఎవడూ ఉండడు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఓడలు బండ్లు, బండ్లు ఓడలౌతాయనే సామెత రాజకీయాలకు కూడా కరెక్ట్‌గా వర్తిస్తుంది. మన ప్రజాస్వామ్య దేశంలో ఓటరు దేవుడు ఎవరికి, ఎప్పుడు పట్టం కడతారనేదీ ఏ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేని మిస్టిరీయస్ పాయింట్.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, తెలుగు రాజకీయాలను, నారా చంద్రబాబు నాయుడు అనే పేరును వేరు చేసి చూడలేం. ఎందుకంటే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన పేరు లేకుండా ఏ ఒక్క రోజు కూడా న్యూస్ పేపర్లు పబ్లిష్ అయ్యుండవని కచ్చితంగా చెప్పొచ్చు. సరిగ్గా ఏడాది కిందట.. ఇంచుమించు పదిరోజులు అటూ ఇటుగా.. చంద్రబాబు నాయుడు ఇదే సమయంలో జైళ్లో ఉన్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే ఇప్పుడు దేశంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్ జాబితాలో నారా చంద్రబాబు నాయుడు టాప్‌ 5లో నిలిచారు.

ఇండియా టుడే సంస్థ ప్రకటించిన మోస్ట్ పవర్‌ఫుల్ పొలిటిషీయన్ ఇన్ ఇండియా జాబితాలో చంద్రబాబుకు ఐదోస్థానం దక్కింది. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి స్థానంలో నిలవగా.. ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రెండో స్థానంలో ఉన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా 3వ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 4వ స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే.. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిందన్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి పీఎం అయ్యారన్నా.. అది చంద్రబాబు సహకారంతోనే అనేది జగమెరిగిన సత్యం. వీటికి తోడు 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం ఎదుర్కొన్న టీడీపీని.. ఐదేళ్లు తిరిగేసరికి అధికారం చేపట్టేదిశగా నడిపించిన నాయకుడు చంద్రబాబు.

About amaravatinews

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *