ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా వారందరికి హైకోర్టు నోటీసులు.. మళ్లీ ఇదేం ట్విస్ట్!

పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పెద్దిరెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన చల్లా రామచంద్రారెడ్డి, ఇతర పార్టీల అభ్యర్థులు, ఆర్‌వో, జిల్లా ఎన్నికల అధికారికి నోటీసులు జారీచేసింది. పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కేసుపై అవగాహన కోసం నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది.

About amaravatinews

Check Also

బాబోయ్ మళ్లీ వానలు.. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! అతిభారీ వర్షాలు..

నిన్న, మొన్నటి వరకు వానలు నానాభీభత్సం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్న తరుణంలో IMD మరో బాంబ్ పేల్చింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *