Kadam

హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కస్టడీ కోరనున్న సీఐడీ… ఈడీ రాసిన లేఖపై కూడా నిర్ణయం తీసుకోనున్న సీఐడీ

హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవకతవకల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావును కస్టడీ కోరనుంది సీఐడీ. నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జగన్‌తో పాటు మరికొంత మంది నిందితులను విచారించనుంది సీఐడీ. ఈడీ రాసిన లేఖపై కూడా నిర్ణయం తీసుకోనుంది సీఐడీ. ఈ క్రమంలో హెచ్‌సీఏ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈడీ నెక్స్ట్ యాక్షన్ ప్లానేంటి? అనే అంశం ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవకతవకలపై ఈడీ విచారణ మొదలుపెట్టింది. ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సీఐడీకి …

Read More »

తెలంగాణలో రోహిత్ వేముల చట్టం..! బీజేపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: డిప్యూటీ సీఎం భట్టి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన వ్యక్తిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. రోహిత్ వేములకు న్యాయం చేయడానికి త్వరలోనే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులైన వారికి పదవులివ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క. …

Read More »

ఇక ఆ వారంలో వరుసగా 2 రోజుల సెలవులు.. తెరపైకి సరికొత్త డిమాండ్‌

వేసవి సెలవుల తర్వాత జూన్‌ 12 నుంచి పాఠశాలలు తెరుచుకున్న తర్వాత అన్ని పాఠ్యాంశాలతో బిజీగా తరగతులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు పాఠశాలల విషయంలో ఓ డిమాండ్‌ మరింతగా పెరిగిపోతోంది. హైదరాబాద్‌లోని పాఠశాలలకు రెండవ శనివారం సెలవులు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ క్యాలెండర్‌లో రెండవ శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయని పేర్కొన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌ అన్ని చోట్ల సెలవు ఇవ్వడం లేదు. దీంతో సెలవులు అమలు కచ్చితంగా జరగాలని డిమాండ్ ఉంది. హైదరాబాద్ పాఠశాలల సెలవు …

Read More »

అడవిలో దారి తప్పిన ఫారెస్ట్ ఆఫీసర్.. 13 రోజులైనా జాడలేదు! ఏంటా అని వెతగ్గా.. చివరికి..

నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని అప్పాపూర్ చెంచుపేటకు చెందిన తోకల మల్లయ్య(65) అటవీ శాఖలో సుదీర్ఘ కాలం పని చేసి రిటైర్డ్ అయ్యాడు. అయితే ఇంటి వద్దే ఉంటున్న మల్లయ్య అటవీ ఉత్పత్తుల సేకరణకు తరచూ అడవిలో అటూ ఇటూ తిరుగుతుంటాడు. అయితే గత నెల 28వ తేదీన ఇదే మాదిరిగా అడవిలోకి వెళ్లిన మల్లయ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు. చుట్టుపక్కల అంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో సమీపంలోని పెంటల్లోని చెంచులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి సైతం …

Read More »

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. మందుబాబులకు పెద్ద కష్టమొచ్చిందే

మందుబాబులకు మరీ పెద్ద కష్టమొచ్చిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మందుబాబులకు ఈ బిగ్ అలెర్ట్. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిలా మారింది. మరి ఇంతకీ ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందామా..  దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలకు, ఇతర క్రైమ్స్‌కు మద్యపానం ప్రధాన కారణంగా మారింది. మద్యం తాగడం వల్ల వ్యక్తిగతంగా మాత్రమే కాదు.. కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణలో లిక్కర్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. మద్యం మత్తులో వాహనాలు నడిపి …

Read More »

వడ్డీ వ్యాపారి వేధింపులకు వ్యాపాారి బలి.. సంచలనంగా మారిన ఆడియో రికార్డ్..

వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వారి వేధింపుల వల్ల ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో మరో వ్యాపారి బలయ్యాడు. ఆయన చనిపోయే ఆడియో రికార్డు చేసి తన చావుకు ఎవరు కారణమో చెప్పారు. అంతేకాకుండా ఆ ఆడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు. ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫైనాన్సియర్స్ అరాచకాలకు మన్యం జిల్లాలో ఓ వ్యాపారి బలయ్యాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో చోటుచేసుకున్న హృదయవిధారక ఘటన అందరినీ కలిచివేస్తుంది. స్నేహితుడు చేతిలో మోసపోవడంతో పాటు ఆర్థిక వేధింపులు తట్టుకోలేక వ్యాపారి ఇండూరి నాగభూషణరావు(63) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాలూరు …

Read More »

యానాం గోదావరిలో తొలి పులస దొరికేసిందోచ్.. కేజీకి ఎంత పలికిందో తెలిస్తే స్టన్.!

యానాం గోదావరిలో మత్యకారుల వలకు తొలి పులస చేప చిక్కింది. యానాం పుష్కర్ ఘాట్ వద్ద కేజీపైన ఉన్న పులస చేపను వేలంలో 15 వేల రూపాయలకు మత్స్యకార మహిళ పోన్నమండ రత్నం దక్కించుకుంది. స్థానిక మార్కెట్‌లో ఈ పులసను 18 వేల రూపాయలకు మత్యకార మహిళ రత్నం విక్రయించింది. పులసలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరిలోకి వెళుతూ వలకు చిక్కుతాయి. గోదావరికి ఔషధ గుణాలున్న ఎర్ర నీరు వచ్చినప్పుడు.. ఎదురీదుతూ వెళ్లడం వల్ల పులస చేప అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతున్నారు …

Read More »

ఇప్పట్లో వానల్లేవ్‌.. ఆ జిల్లాలకు మాత్రం వరద ముప్పు! హెచ్చరికలు జారీ చేసిన సర్కార్..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపించడం లేదు. అరకోర జల్లులు మినహా భారీ వానలకు అనుకూల వాతావరణం కానరావడం లేదు. మరోవైపు ఆగ్నేయ దిక్కులో ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి జార్ఖండ్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 15 వరకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు …

Read More »

ఇవాళ సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… ఉత్కంఠ రేపుతున్న విచారణ

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోమారు సిట్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే ఏప్రిల్‌ 18న ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. స్కామ్‌లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డేనని, మద్యం పాలసీపై తన సమక్షంలోనే మూడు సార్లు సిట్టింగులు జరిగాయని ఆయన చేసిన వ్యాఖ్యలే సిట్ దర్యాప్తునకు ఊతమిచ్చాయి. అంతే స్పీడుతో… ఏపీలో రాజకీయాల్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణానికి 2019 ఆగస్టు నెలలో విత్తనం పడింది. వైసీపీ పవర్లోకి వచ్చిన మూడునెలల్లోనే లిక్కర్ పాలసీని సమూలంగా మార్చి, ప్రభుత్వ ఆధ్యర్యంలోనే మద్యం అమ్మకాలు జరిపేలా 3 …

Read More »

 పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల క్వశ్చన్ పేపర్ మారుతుందోచ్‌.. కొత్త మార్పులు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రంలో పలు మార్పులు చోటు చేసుకోకున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థుల్లోని సృజనాత్మకత పరిశీలించేలా ప్రశ్నాపత్రంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో సీబీఎస్‌ఈ బోర్డుతో పోల్చితే రాష్ట్ర బోర్డుల్లో ఉత్తీర్ణత తక్కువగా నమోదు అవుతోంది. దీనిపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ ఆయా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. పదో తరగతి ఫలితాల్లో గణనీయంగా ఫెయిలౌతున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నట్లు …

Read More »