ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు, మంత్రులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతుల దగ్గరి నుంచి పంట కొనుగోలు చేసిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించడంలో జాప్యం కావద్దని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏ రైతు అయినా ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో …
Read More »ఏపీలో ప్రజలకు భారీ ఊరట?.. విద్యుత్ ఛార్జీలపై కీలక అప్డేట్!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కేలా ఉంది. రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల మోత లేకుండా.. 2025-26కి డిస్కంలు వార్షికాదాయ నివేదిక (ఏఆర్ఆర్)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి అందజేశాయి. ఈ నివేదికలో విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదు.. ఈ నిర్ణయంతో ప్రజలకు ఊరట లభించనుంది. నివేదికలో విద్యుత్ కొనుగోళ్లు.. విక్రయాలకు మధ్య వ్యత్యాసం రూ. 14,683.24 కోట్లుగా పేర్కొన్నారు. కొనుగోళ్లు, నిర్వహణకు రూ. 58,868.52 కోట్లు అవసరమని.. విద్యుత్ విక్రయాల ద్వారా రూ. 44,185.28 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశాయి …
Read More »ఏపీ మద్యం షాపుల దగ్గర బ్యానర్లు ఏర్పాటు.. రూ.5 లక్షల ఎఫెక్ట్, ఆసక్తికర కారణం
ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అక్టోబర్ నెల నుంచి అమల్లోకి వచ్చింది. లాటరీ ద్వారా కేటాయించిన షాపుల్లో విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మద్యం ధరల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ప్రస్తుతం ప్రతి వైన్ షాప్ వద్ద ధరల పట్టికలు కనిపిస్తున్నాయి. అలాగే.. MRP ధరలకే మద్యం అమ్మబడును.. అని కూడా బ్యానర్లు కడుతున్నారు. మద్యం బ్రాండ్, ఎంత ఎంఎల్ ఎంత ధరకు లభిస్తుంది వంటి వివరాలతో బ్యానర్లు పెడుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతి వైన్ షాప్ …
Read More »టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరణ.. తొలిరోజే మాస్ వార్నింగ్!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కొత్త ఛైర్మన్గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇకపై పరీక్షల వాయిదాలు ఉండవని, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే తొలగించుకోండంటూ.. బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్ తన కల అన్నారు. …
Read More »బాబోయ్ మళ్లీనా.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! ఈ ప్రాంతాల్లో జోరు వానలు
దక్షిణాదిన దడ పుట్టించిన ఫెంగల్ తుపాన్ తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఫెంగల్ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. దీంతో ఇప్పట్లో వానలు మళ్లీ రావులే అని జనాలు సంబరపడ్డారు. కానీ ఇంతలో వాతావరణ శాఖ మరో సంచలన వార్త అందించింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావారణ శాఖ వెల్లడించింది. ఈ మేరక శుక్రవారం వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో …
Read More »పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ ప్రయోగం సక్సెస్.. సూర్యకిరణాలపై అధ్యయనం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన PSLV- C 59 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది ఉపగ్రహం. ప్రోబా 3 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. దీంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా3 సూర్యకిరణాలపై అధ్యయనం చేయనుంది. ప్రోబా 3లో రెండు ఉపగ్రహాలున్నాయి. 310 కేజీల బరువుండే కరోనా గ్రాఫ్ స్పేస్, 240 కేజీల బరువున్న ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఈ రాకెట్లో ఉన్నాయి. ఈ జంట ఉపగ్రహాలు …
Read More »శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ..!
విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కు ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ గురువారం గాలిలోకి ఎగిరింది. టెంపుల్ సిటీ తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో తిరుపతి నుంచి సింగపూర్కు ప్రైవేట్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం(డిసెంబర్ 6) ఉదయం 5 …
Read More »హైదరాబాద్లో అతిపెద్ద సేఫ్టీ సెంటర్.. AP యువతకు నైపుణ్య శిక్షణ
తెలుగు రాష్ట్రాలతో గూగుల్ కీలక ఒప్పందాలు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు ఏపీ ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం AP యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతోంది. అలాగే.. దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ సెంటర్ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇంతకీ.. ఈ గూగుల్ సేఫ్టీ సెంటర్ ఉపయోగాలేంటి?.. ఏపీలో ఎలాంటి ఆవిష్కరణలు చేయబోతోంది?…ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దాని ద్వారా ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు …
Read More »రాశిఫలాలు 06 డిసెంబర్ 2024:ఈరోజు రవియోగం ప్రభావంతో సింహం సహా ఈ రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం..!
మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఈరోజు వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరగడం వల్ల, మీకు మంచి ఫలితాలొస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష్ స్తోత్రం’ వృషభ రాశి: ఈ రాశి వారు …
Read More »ఘనంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిల్వర్ జుబ్లీ కార్యక్రమం.. పలువురి ఉద్యోగులకు సత్కారం
ప్రముఖ పీడియాట్రిక్ మల్టీస్పెషాలిటీ, పెరినాటల్ హాస్పిటల్ ‘రెయిన్బో చిల్డ్రన్స్ ఆస్పత్రి’ తన 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 1న హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఒక కన్వెన్షన్ హాల్లో జరిగింది. సదరు హాస్పిటల్ చైర్మన్, ఎండీ రమేష్ కంచర్ల, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతి రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. హాస్పిటల్స్ నిర్వహణ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఇతర ప్రముఖ డాక్టర్లు, నర్సులతో సహా 4000 మందికి పైగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాత్రింబవళ్లు శ్రమించే డాక్టర్లు ఈ కార్యక్రమంలోని …
Read More »