Kadam

ఆ విద్యార్ధులకు సంక్రాంతి సెలవులు 3 రోజులే.. విద్యాశాఖ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. టెన్త్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు 100 రోజుల ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ అమల్లోకి వచ్చాక తొలిసారి పదో తరగతి పరీక్షలు విద్యార్ధులు రాయనున్నారు. విద్యార్ధులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను …

Read More »

ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు.. ఏడాది ఏడాదికి పెరిగే నంది.. కలియుగాంతానికి చిహ్నం..

భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో కొన్ని సంఘటనలు నమ్మలేని నిజాలుగా సైన్ కు సవాల్ గా మిగిలిపోతున్నాయి. అనేక ఆలయాలు వాటి రహస్యాలు, అద్భుత మైన శిల్పకళా సంపదతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మిస్టరీ శివాలయం ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఆలయంలోని నందీశ్వరుడు విగ్రహం నిరంతరం పెరుగుతూనే ఉంటుదని. ఈ విగ్రహం పరిమాణం పెరగడంలోని రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. అంతే కాదు ఈ విగ్రహం పరిమాణం పెరగడంపై …

Read More »

భూకంపాల విషయంలో తెలుగురాష్ట్రాలు సేఫేనా..? మరింత పెరిగిన భయాలు

తెలంగాణకు భూకంపాల భయాలేం లేవు.. మనది దక్కన్‌ పీఠభూమి.. సముద్రానికి ఎత్తులో ఉంటుంది.. నిర్భయంగా ఉండొచ్చని చెబుతుంటారు కొందరు. ఎవరు చెప్పారసలు తెలంగాణ భూకంపాల జోన్‌లో లేదని? దేశవ్యాప్తంగా భూకంపాలు వచ్చే ఛాన్స్‌ ఉందంటూ వాటిని నాలుగు జోన్లుగా విభజించారు. కావాలంటే ఆ లిస్ట్‌ ఒక్కసారి చెక్‌ చేసుకోవచ్చు. అందులో తెలంగాణలోని ఏరియాలు కూడా ఉంటాయి. మెయిన్‌గా హైదరాబాద్‌ ఉంటుంది. సో, హైదరాబాద్‌కు కూడా భూకంపం ముప్పు ఉంది. ఒక్క తెలంగాణ గురించే ఎందుకు చెప్పుకోవాలి? విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, కర్నూలు.. ఇవన్నీ భూకంపాల …

Read More »

నిరుద్యోగులకు అలర్ట్‌.. సీఏపీఎఫ్‌ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు: కేంద్రం వెల్లడి

కేంద్ర సాయుధ బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్‌ (AR)లో లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గత ఐదేళ్లలో దాదాపు 71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో బుధవారం వెల్లడించారు. ఖాళీగా ఉన్న సీఏపీఎఫ్‌, ఏఆర్‌ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్‌ ఏర్పాటు, కొత్త పోస్టులను సృష్టించడం వంటి వాటివల్ల ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా ఖాళీలు పరిశీలిస్తే.. అక్టోబర్‌ 30 నాటికి …

Read More »

సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేస్తే ఇక ఉక్కుపాదమే.. 28,000 URLలను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం

భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 28000 పైగా URLలను రికార్డు స్థాయిలో బ్లాక్ చేసింది. 2024లో జాతీయ భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఉన్న సోషల్ మీడియా పోస్టులన్నింటిని కేంద్రం బ్లాక్ చేసింది. ఈ URLలలో ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాద ఉద్యమాలకు సంబంధించిన కంటెంట్, ద్వేషపూరిత ప్రసంగాలు, మోసం, జాతీయ భద్రత, ప్రజా శాంతిభద్రతలకు ముప్పుగా భావించే అంశాలు ఉన్నాయని పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం ఈ యూఆర్ఎల్ లను బ్లాక్ చేయడం జరిగింది.. ఇది దేశానికి హానికరంగా …

Read More »

ప్రతి రైలు టికెట్‌పై 46 శాతం రాయితీ.. పార్లమెంట్‌లో రైల్వే మంత్రి కీలక విషయాలు!

 దేశంలోనే రైల్వే స్టేషన్‌ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి ప్రభుత్వం అతిపెద్ద రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని రైల్వే మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను భారత్‌లో అప్‌గ్రేడ్ చేసే పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం.. భారత రైల్వే ద్వారా ప్రయాణికులకు ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, అన్ని రకాల రైలు టికెట్లపై రాయితీలు కల్పిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా మంత్రి లోక్‌ సభలో పలు కీలక విషయాలను వెల్లడించారు. అన్ని రకాల టికెట్లపై ప్రతి …

Read More »

ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన

అర్హులైన ప్ర‌తి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూట‌మి ప్ర‌భుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తోంద‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. బ‌డుగు, బ‌లహీన వ‌ర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాల‌కు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు సంబంధించి మంత్రి గొట్టిపాటి బుధ‌వారం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ల‌క్షలాది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా ల‌బ్ధి పొందుతున్నార‌ని తెలిపారు. 15,17,298 ఎస్సీ కుటుంబాలు, 4,75,557 ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో ల‌బ్ధిదారులుగా ఉన్నార‌ని మంత్రి …

Read More »

కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్

సూపర్-6 హామీలు అమలు చేయలేదు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని పోరుబాటకు సిద్ధమవ్వాలని వైసీపీ పార్టీ శ్రేణులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.. ఏపీలో పాలనపై అందరూ అసంతృప్తితో ఉన్నారని.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు సంధించారు.. బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో వైసీపీ చీఫ్ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హామీలు అమలు …

Read More »

హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ.. దేశంలోనే తొలి సెంటర్‌గా..

తెలంగాణ ప్రభుత్వం మరో విజయం సాధించింది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్, హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC) స్థాపనకు అంగీకరించింది. ఇది భారత్‌లో తొలి సెంటర్‌గా, ఏషియా పసిఫిక్‌లో రెండవదిగా, ప్రపంచవ్యాప్తంగా ఐదవదిగా గుర్తింపు పొందనుంది. గూగుల్ LLC, తెలంగాణ ప్రభుత్వం మధ్య బుధవారం ఈ కీలక ఒప్పందం కుదిరింది. GSEC సెంటర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ హబ్‌గా తీర్చిదిద్దనుంది. గూగుల్ సెంటర్ సైబర్ భద్రత, ఆన్‌లైన్ సేఫ్టీ ఉత్పత్తుల రూపకల్పనపై ఫోకస్ చేయనుంది . అధునాతన పరిశోధనలతో పాటు …

Read More »

 చివరి నిమిషంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కమర్షియల్ రాకెట్ ప్రయోగం ఆఖరి నిమిషంలో నిలిచిపోయింది.. బుధవారం పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) వెల్లడించింది. రాకెట్ ప్రయోగానికి ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా ఉపగ్రహంలో సమస్యను గుర్తించింది.. దీంతో చివరి నిమిషంలో రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేశారు. తిరిగి రేపు సా.4:12కు PSLV C-59 రాకెట్‌ ప్రయోగం జరగనుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ …

Read More »