Kadam

చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణం అదేనట.. ముందే అలర్టవ్వండి

నేటి కాలంలో, చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతుంది. కొంతమంది జుట్టుకు రంగులు కూడా వేస్తున్నారు.. అయితే చిన్న వయసులోనే నెరిసిన వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి.. నేటి కాలంలో, చిన్న వయస్సులోనే జుట్టు నెరిసే సమస్య బాగా పెరిగింది. ఒకప్పుడు వృద్ధుల్లో ఈ సమస్య కనిపించేది.. కానీ.. ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సులో ఉన్న వారి జుట్టు కూడా బూడిద రంగులోకి మారి.. క్రమంగా తెల్లబడుతోంది.. మీకు కూడా ఈ సమస్య …

Read More »

ప్రియురాలితో సహా-జీవనం.. చేసిన తప్పును కప్పపుచ్చుకునేందుకు 40ముక్కలుగా నరికేసిన ప్రియుడు..!

ఇద్దరూ ఏడాదిన్నర పాటు లివ్-ఇన్-రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఏడాదిన్నర పాటు సహజీవనం చేసిన గంగి తమిళనాడుకు పనికి వెళ్లగా, నరేష్ బెంగళూరుకు వచ్చి జీవించడం ప్రారంభించాడు.జార్ఖండ్‌లో దారుణం వెలుగుచూసింది. రాంచీలో లైవ్-ఇన్ పార్టనర్ హత్య కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు తన ప్రియురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆపై కండువాతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. పట్టుబడకుండా ఉండేందుకు మృతదేహాన్ని 40 ముక్కలుగా నరికేశాడు. ముక్కలను సంచిలో తీసుకువెళ్లి అడవిలో పాతిపెట్టాడు. ఇక అక్కడి నుంచి గుట్టుచప్పుడు …

Read More »

Mystery Temple: ఈ ఆలయంలో దీపం నెయ్యి, నూనెతోనో కాదు నీళ్లతో వెలుగుతుంది.. అద్భుతం చూసేందుకు పోటెత్తే భక్తులు

భారతదేశంలో అనేక పురాతన, రహస్యాలు దాచుకున్న దేవాలయాలు ఉన్నాయి. అందుకే భారతదేశాన్ని దేవాలయాల దేశం అని కూడా అంటారు. ఈ ఆలయాలలని రహస్య సంఘటనల మిస్టరీని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అయితే ఈ ప్రత్యేకమైన రహస్యాల కారణంగా ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశ, విదేశాల నుంచి అనేక మంది ఇక్కడకు వస్తూ ఉంటారు. అటువంటి అద్భుత, రహస్యమైన ఆలయం ఒకటి మధ్య ప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఉన్న ఓ ఆలయంలో ఏళ్ల తరబడి నీళ్లతోనే దీపాలు వెలుగుతున్నాయి. ఇది …

Read More »

చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పం.. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన అనంతరం ఏపీలోని చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే ధ్యేయంగా.. పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు సీఎం చంద్రబాబు వ్యూహంతో ముందుకెళ్తున్నారు.. నక్కపల్లి మండలంలోని విశాఖ-చైన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో (వీసీఐసీ) పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.. ఈ క్రమంలోనే నక్కపల్లి మెడలో స్టీల్ నగ చేరబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్‌ సెల్లార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ఇండియా కలిసి ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నాయి. లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ …

Read More »

Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో మాయమవుతున్న శవాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

మార్చురీలో శవాల మాయానికి సంబంధించి అసిస్టెంట్‌ అశోక్‌పై ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు.ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని అనాథ శవాల మాయం వ్యవహారంలో ఉచ్చు బిగుస్తోంది. మెడికల్‌ బోర్డు అధికారుల బృందం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం షాకిస్తోంది. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో మృతదేహాల మాయం కేసు ప్రకంపనలు రేపుతోంది. దీనికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషవ్ టీమ్‌ విచారణ వేగవంతం చేసింది. డీఎంఈ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారితోపాటు మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ ఆధ్వర్యంలో …

Read More »

వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో ప్రపంచ రికార్డ్.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చాడుగా

Urvil Patel: ఉర్విల్ పటేల్ గుజరాత్‌కు చెందిన క్రికెటర్. 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎంపికైన ఈ యువ స్ట్రైకర్‌కు ఆడే అవకాశం రాలేదు. అలాగే, ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన 26 ఏళ్ల ఉర్విన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత తుఫాన్ సెంచరీతో ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీలను పశ్చత్తాపడేలా చేశాడు. దేశవాళీ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా అద్భుతమైన సెంచరీతో కావడం విశేషం. అలా అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డును …

Read More »

PM Modi: ప్రధాని మోడీ వికసిత్ భారత్‌లో భాగమవ్వండి.. యువతకు పిలుపునిచ్చిన పీవీ సింధు, ఆయుష్మాన్ ఖురానా

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చిన వికసిత్ భారత్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అయుష్మాన్ ఖురానా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భాగమయ్యారు. ఈ మేరకు వికసిత్ భారత్ ఛాలెంజ్ లో పాల్గొని దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారీ స్టార్ సెలబ్రిటీలుజాతీయ యువజనోత్సవం -2025 ను పురస్కరించుకుని ఇటీవల ప్రధాని మోడీ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో …

Read More »

Khammam District: ఆ ప్రభుత్వ పాఠశాలలో ఒక స్టూడెంట్.. ఒక టీచర్ ..

అది ఓ ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..? ఆ ఖర్చు గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ విద్యార్థి కోసం ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వం ఒక లక్ష కాదు… రెండు లక్షలు కాదు.. ఏకంగా 12.84 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది.. ఎలా అంటారా. .ఆ పాఠశాల ఎక్కడ ఉంది అంటారా..? ప్రైవేట్ విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్య కోసం …

Read More »

Ashwini Vaishnaw: వాళ్ల సంగతి చూడాల్సిందే.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కేంద్రం సంచలన ప్రకటన..

సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదేరకమైన వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంపై కేంద్రం ప్రభుత్వం లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేసింది.. ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో కించపర్చేలా పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని.. నాయకులను, మహిళలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు సైతం …

Read More »

AP Mega DSC 2024 New Syllabus: టీచర్ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌.. మెగా డీఎస్సీ కొత్త సిలబస్ వచ్చేసింది! డైరెక్ట్ లింక్ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ అందించింది. ఇప్పటికే కొన్ని కారణాలతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నోటిఫికేషన్‌ విడుదలయ్యేంత వరకు ఎదురు చూడకుండా సన్నద్ధత కొనసాగించాలని ఇటీవల విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా డీఎస్సీ సిలబస్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో డీఎస్సీ సిలబస్ నవంబర్‌ 27 (బుధవారం)వ తేదీన విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో సిలబస్‌ను పాఠశాల …

Read More »