ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. గండికోట, రాజమండ్రి పుష్కర్ ఘాట్ డెవలెప్మెంట్కు కేంద్రం నిధులు విడుదల చేయడమే అందుకు నిదర్శమన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు.ఆంధ్రప్రదేశ్ లోని రాజుల పరిపాలనకు సజీవ సాక్ష్యం అయిన గండికోట అభివృద్ధికి కేంద్ర టూరిజం శాఖ 77.91 కోట్లు మంజూరు చేసింది. ఏపీలోని గండికోట, పుష్కర్ ఘాట్కు కేంద్ర టూరిజం శాఖ నిధులు విడుదల చేయడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై …
Read More »ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..
తిరుమల వెంకన్న దర్శనం కోసం.. నడక మార్గాల్లో కొండకెళుతున్నారా.. అయితే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. అయితే జాగ్రత్తల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న భక్తులు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో కొండకు వెళ్తారు. అయితే ఈ ఏడాదిలోనే అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ పెళ్లయిన వారం రోజుల్లోపే బెంగళూరు కు …
Read More »పోస్టాఫీసుల్లో ఖాతాల కోసం జాతర.. క్యూ కడుతున్న మహిళలు.. కారణం ఏంటో తెలుసా?
తపాలా శాఖ పోస్టాఫీస్ లు ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. పొదుపు ఖాతాల కోసం, ఆధార్ అనుసంధానం కోసం మహిళలతో పోటెత్తుతున్నాయి. సంక్షేమ ఫలాలు అందాలంటే తపాలా కార్యాలయాల్లో ఖాతా ఉండాలన్న ప్రచారంతో తిరుపతి పోస్టాఫీస్ మరో జాతరను తలపిస్తోంది. పోస్టాఫీసుల్లో ఖాతాలుంటే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేసుకోవాలన్న సూచన ఇప్పుడు మహిళల లబ్ధిదారుల్లో ఆందోళన కు కారణమైంది. రాష్ట్రమంతా పొస్టాఫీసులకు మహిళలు క్యూ కడుతున్న పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో అకౌంట్ లేనివారే తెరవాలన్నా సూచన దుష్ప్రచారంగా మారింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకునే …
Read More »ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగొస్తుంది.. నయనతార చెప్పిన కర్మ సిద్ధాంతం.. ధనుష్ గురించేనా.. ?
హీరోయిన్ నయనతార, ధనుష్ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే సుమారు మూడు పేజీలతో ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసింది నయన్. హీరో ధనుష్ ను ఉద్దేశిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు మరోసారి తన ఇన్ స్టాలో షాకింగ్ పోస్ట్ చేసింది.లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో సైలెంట్గా ఉన్న వార్.. ఇప్పుడు రచ్చకెక్కింది. నానుమ్ రౌడీ సినిమా నుంచి మూడు సెకన్ల వీడియో ఉపయోగించినందుకు …
Read More »కొనసాగుతున్న మహా సస్పెన్స్.. మహాయుతి కీలక భేటీకి అమావాస్య ఎఫెక్ట్..
మహారాష్ట్ర సీఎం ప్రకటనే తరువాయి అనుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా మహాయుతి నేతల కీలక సమావేశం రద్దవ్వడం హాట్ టాపిక్గా మారింది. అయితే అమావాస్య కారణంగానే మహాయుతి మీటింగ్ రద్దైనట్లు తెలుస్తోంది. రెండ్రోజులపాటు శుభముహూర్తాలు లేకపోవడం సమావేశాన్ని క్యాన్సిల్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఆదివారం రాత్రి ఢిల్లీ లేదా ముంబై ఈ సమావేశం నిర్వహంచనున్నట్లు తెలుస్తోంది. మీటింగ్ రద్దవ్వడంతో షిండే సతారాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. రెండ్రోజులపాటు అక్కడే ఉండి… ఆదివారం నాటి మీటింగ్కు హాజరవుతారంటూ శివసేన నేతలు చెబుతున్నారు. అయితే షిండే ఇంకా అసంతృప్తితో …
Read More »కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మరో పోరాటం చేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సాధనకు కేసీఆర్ రగిలించిన ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ తట్టిలేపేలా.. అప్పటి ఉద్యమాన్ని గుర్తుతెచ్చేలా… ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ను ఇరుకునపెట్టేలా… రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. మరి 33 జిల్లాల్లో బీఆర్ఎస్ దీక్షా దివస్ ఎలా జరిగింది…? కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఎక్కుపెట్టిన బాణాలేంటి…?తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా… కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనియ్యా… ఇవి తరుచూ సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్పై చేస్తున్న వ్యాఖ్యలు.. ఇక ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఫుల్ సీరియస్గా తీసుకుంది. ఎప్పటికప్పుడు రేవంత్ కామెంట్స్కి కౌంటర్లు ఇస్తూనే… …
Read More »ఇక ప్రజల్లోకి జగన్.. జిల్లాల వారీగా పర్యటనలు ఎప్పటి నుంచంటే..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. ఓ వైపు సోషల్ మీడియా అరెస్టులు, మరో వైపు అదానీ వ్యవహారం.. ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సంక్రాంతి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు.. తాడేపల్లిలో జరిగిన వైసీపీ నేతల సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని.. …
Read More »డిప్యూటీ సీఎంగా ఉన్న నాకే సహకరించడం లేదు.. కేంద్రానికి లేఖ రాస్తా: పవన్ కల్యాణ్ ఫైర్
ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కాకినాడలో ఇల్లీగల్ వ్యవహారాల అంతు తేలుస్తామంటున్నారు. యాంకరేజ్ పోర్టులో పర్యటించిన పవన్ కల్యాణ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చారు.కాకినాడ యాంకరేజ్ పోర్టు అక్రమార్కులకు అడ్డాగా మారింది. కొన్ని ముఠాలు రేషన్ బియ్యం సహా పలు రకాల వస్తువులను ఓడలో విదేశాలకు తరలిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ రెండు రోజుల క్రితం సముద్రంలో …
Read More »అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్ టైమ్ లేక అవస్థలు..
అమెరికాలోని నిబంధనల ప్రకారం విద్యార్థులు క్యాంపస్లలో మాత్రమే పని చేయాలి. కానీ, అక్కడ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చాలా మంది విద్యార్థులు క్యాంపస్ వెలుపల అక్రమంగా పార్ట్టైమ్ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అక్కడ పార్ట్టైమ్ ఉద్యోగాలు లభించడం కష్టంగా మారడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా యువతులు ఆయాలుగా పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రోజుకు 8 గంటలపాటు ఆరేళ్ల బాలుడి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నానని, అందుకు గాను తనకు ఆ బాలుడి కుటుంబం గంటకు 13 డాలర్ల చొప్పున …
Read More »Amazon: ఆఫర్ల జాతర.. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్లో కళ్లు చెదిరే డిస్కౌంట్స్..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో ఆకర్షణీయమైన సేల్తో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించింది. ఇంతకీ ఈ సేల్లో భాగంగా లభిస్తున్న ఆఫర్లు ఏంటి.? ఏయే వస్తువులపై ఎలాంటి డిస్కౌంట్స్ లభించనున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..బ్లాక ఫ్రైడే సేల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అగ్రరాజ్యం అమెరికా. షాపింగ్ సీజన్ ప్రారంభానికి సూచికగా ఏటా బ్లాక్ ఫ్రైడే్ పేరుతో సేల్ను నిర్వహిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సేల్ను భారత్లోనూ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal