Kadam

తిరుమలలో కల్తీకి చెక్.. కొండపై అందుబాటులోకి ఫుడ్‌ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్!

భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కల్తీకి చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను మంగళవారం టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో జె. శ్యామలరావుతో కలిసి ప్రారంభించారు. ఇకపై గతంలో లాగా స్వామివారి ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు ఈవో …

Read More »

మాజీ మంత్రి అనిల్ మెడకు మైనింగ్ ఉచ్చు… శ్రీకాంత్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. స్కామ్‌ల మీద స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయి. వరుస కేసులతో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై రెండు నెలలుగా జైలులోనే ఉన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయనపై పదికి పైగా కేసులు నమోదవడంతో.. ఇప్పుడప్పుడే బెయిల్ రావడం కష్టమేనని అనుచరులే అనుకుంటున్నారు. ఇదే మైనింగ్ కేసు మరికొంత మంది నేతల చుట్టూ తిరుగుతుండటం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ అయిన …

Read More »

ఒంటిమిట్టలో నిరంత‌రాయంగా అన్న‌ప్ర‌సాదాలు…నిధులు కేటాయించిన టీటీడీ..మరెన్నో కీలక నిర్ణయాలు..!

తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు గాను రూ.4.35 కోట్లు నిధులు కేటాయించింది.  …

Read More »

అల్పపీడనం అలెర్ట్.. తెలంగాణకు అతిభారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రసరణ మరియు ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి.. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, మరియు గోదావరి జిల్లాలపై పడింది. జూలై 24 వరకు ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అటు తెలంగాణలో ఈనెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఆసిఫాబాద్‌, …

Read More »

ఆర్డర్ చేసిన పార్శిల్ ఇంటికొచ్చిందనుకునేరు.. తీరా డెలివరీ అయింది చూడగా కళ్లు తేలేశారు

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల నూనెపల్లెకు చెందిన పెయింటర్ రమణ అనుమానాస్పద మృతి పట్టణంలో కలకలం రేపింది. మృతుడు రమణకు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రమణమ్మతో ఇరవై సంవత్సరాల క్రితం వివాహం అయింది. రమణ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీళ్లకు జ్యోతి, చందన, సాయి అనే ముగ్గురు సంతానం ఉన్నారు. ఈ నేపధ్యంలో పెయింటింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్న రమణకు వివాహేతర సంబంధం ఉందంటూ తరచూ భార్యభర్తల మధ్య ఘర్షణ జరగుతూ ఉండేది. ఈ క్రమంలో ఒక నెల క్రితం …

Read More »

ఎన్టీఆర్‌ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్‌ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు జులై 22 నోటిఫికేషన్‌ విడుదల.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్‌ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ …

Read More »

ఏపీపీఎస్సీ అటవీ శాఖ నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే?

ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ మొత్తం 691 పోస్టులకి జులై 14న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 100 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ శాఖలో వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ మొత్తం 691 పోస్టులకి జులై 14న నోటిఫికేషన్‌ …

Read More »

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక ఇదొక జీవనాధారంగా మారింది. కానీ పలుచోట్ల ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకోవడం గమనార్హం. కొన్ని చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శ్రామికుల పైసలు దోచుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరికొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లతో మంచి ఉంటూ పనికి రాకున్నా వచ్చినట్లు అటెండెన్స్ వేయించకుంటారు. ఈ అక్రమాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయి అవకతవకలు జరగకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై పనిచేసే …

Read More »

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సొంత ఇంటి పార్టీలో సమస్యలకు కారణం ఇంటి వాస్తు బాగా లేకపోవడమేనా? కవిత ఇంటిలో జరుగుతున్న మార్పులు ఏంటి..? ఇంటి వాస్తు.. ఇది చాలామంది నమ్మకం. ఈ వాస్తు బాగుంటేనే మనకు మంచి జరుగుతుంది అని.. తాము చేసే అన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తామని నమ్ముతూ ఉంటారు. అందులో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్సీ కవిత కూడా …

Read More »

నగరంలో భారీ వర్షం – అత్యవసరం అయితే తప్ప బయటకి రావొద్దు

హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం నాన్‌స్టాప్‌గా పడుతూనే ఉంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మియాపూర్, మలక్‌పేట్, చంచల్‌గూడ, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. చాలాచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి వచ్చాయి. కొన్నిచోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షంతో నెలకొన్న పరిస్థితులపై …

Read More »