దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను నోటిఫికేషన్లో బోర్డు పేర్కొనలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఆర్ఆర్బీ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పరీక్ష జులై 15వ తేదీన ఆన్లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో …
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం.. బీజేపీకి రాజీనామా!
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారని ఆయన రోపించారు. ‘నేను రిజైన్ లెటర్ కిషన్ రెడ్డికి ఇచ్చాను. ఈ లెటర్ స్పీకర్ కు పంపించమని చెప్పానని ఆయన తెలిపారు. నాకు మద్దతుకు వచ్చిన వారిని బెదిరించారని ఆయన ఆరోపించారు. నాకు ముగ్గురు కౌన్సిల్ …
Read More »ఆరోగ్య శాఖలో ఒకేసారి రెండు జాబ్ నోటిఫికేషన్లు.. నిరుద్యోగులకు పండగే!
రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రెండు రకాల నోటిఫికేషన్లను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్టు పోస్టులతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు..తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రెండు రకాల నోటిఫికేషన్లను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్టు …
Read More »అబ్బా పండగే.. వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి.
విశాఖ సముద్రతీరంలో మత్స్యకారుల శ్రమ ఫలించింది. వలల నిండుగా రొయ్యలు, చేపలు, అరుదైన లాబ్స్టర్లు చిక్కాయి. ఈ సీజన్ ప్రారంభంలోనే పుష్కలంగా మత్స్య సంపద లభించడంతో మత్స్యకారులు ఆనందంగా ముంచెమడుతున్నారు. 500 కిలోల వరకు రొయ్యలతో సహా, ఒక్కోటి కిలో బరువున్న లాబ్స్టర్లు భారీ ధర పలుకుతున్నాయి.విశాఖ తీరంలో మత్స్యకారుల పంట పండుతోంది. వేటకు వెళ్లిన మత్స్యకారుల శ్రమ ఫలిస్తుంది. వలల నిండా చేపలు, రొయ్యలు, లాబ్స్టర్లు చిక్కుతున్నాయి. దీంతో మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది. ట్యూనా, పఫర్ ఫిష్, పండుగప్ప, రిబ్బన్ ఫిష్, వివిధ …
Read More »అమరావతిని దక్షిణాసియాలోనే తొలి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తాం.. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలే మా టార్గెట్- మంత్రి లోకేష్
సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వర్క్ షాప్ నకు …
Read More »తల్లిదండ్రుల ఆస్తులు కొడుక్కి రాకుండా చేయొచ్చా? సుప్రీం ఇచ్చిన తీర్పు ఇదే
ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలక అంశంపై విచారణ జరిపింది. తమ కొడుకు పేరును ఆస్తి వాటా నుంచి తొలగించేందుకు తల్లిదండ్రులు వేసిన వ్యాజ్యాన్ని కోర్టు పరిశీలించింది. తమ బాగోగులు చూడటంలో నిర్లక్ష్యం వహించి, మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. అయితే, మార్చి 28న సుప్రీంకోర్టు ఆ వృద్ధ దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం, 2019లో సీనియర్ సిటిజన్ చట్టం కింద ఒక ట్రైబ్యునల్ తల్లిదండ్రులకు పాక్షిక ఊరట కల్పించింది. తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంటి ఏ …
Read More »మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదు.. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయన్నది అవాస్తవం- జలమండలి ఎండీ అశోక్రెడ్డి
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదని జలమండలి ఎండీ అశోక్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆదివారం ఆయన జలమండలి ఉన్నతాధికారులతో కలిసి మంజీరా బ్యారేజ్, గేట్లు, పిల్లర్లు, పంప్హౌజ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి మంచినీరు అందించడానికి నిర్మించిన మంజీరా బ్యారేజ్కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అలాగే బ్యారేజ్కి సంబంధించిన గేట్లు, రోప్ల పనితీరు కూడా సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పారు. అయితే బ్యారేజ్ దిగువన ఆఫ్రాన్ కొంతమేరకు దెబ్బతిన్నదని వెంటనే మరమ్మత్తులకోసం …
Read More »ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. ఖరారు చేసిన అధిష్ఠానం!
ఏపీలో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక కొలిక్క వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. కాగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ కాసేపట్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇక బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం( 01-07-2025) అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు కర్ణాటక బీజేపీ ఎంపీ మోహన్ …
Read More »ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ ఇదే.. జులై 7 వరకు రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ ఈఏపీసెట్ 2025 పరీక్షలో ర్యాంకు పొందిన విద్యార్ధులు ఈ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చు. మొత్తం 3 విడతల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జులై 7 వరకు కొనసాగుతుంది. స్లాట్ బుకింగ్, పేమెంట్ ఆన్లైన్ విధానంలో చేయవల్సి ఉంటుంది. జులై 1 నుంచి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. జులై 6 …
Read More »అయ్యో భాస్కర్.. మళ్లీ పాము కాటుకు గురైన తిరుమల స్నేక్ క్యాచర్.. ఆందోళనలో అధికారులు..
బుసలు కొట్టే పాములతో ఆయన నాట్యం చేయిస్తాడు.. విషపూరిత పాములకు విన్యాసాలు నేర్పిస్తాడు.. అతడే పాముల భాస్కర్గా గుర్తింపు పొందిన భాస్కర్నాయుడు. ఇప్పటికే పలుమార్లు పాము కాటుకు గురయి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన భాస్కర్నాయుడు.. మరోసారి పాముకాటుకు గురయి ఆస్పత్రిపాలయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు టీటీడీ అధికారులు.ప్రమాదకరమైన, విషపూరితమైన పాములను కూడా సులువుగా బంధించడంలో నేర్పరి భాస్కర్ నాయుడు.. స్నేక్ క్యాచర్గా వేల సంఖ్యలో పాములను పట్టిన అనుభవం, నైపుణ్యం ఈయన సొంతం. తిరుమలలో కనిపించే పాములను బంధిస్తూ …
Read More »