హైదరాబాద్ నగర వాహనదారులకు శుభవార్త. నగరంలోని ప్రముఖ ఎలివేటెడ్ కారిడార్లలో ఒకటైన ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈరోజు మంత్రి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో కలిసి కారిడార్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని.. అయితే ఈ ఏడాది దసరా నాటికి కారిడార్ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆలస్యానికి …
Read More »చిరంజీవి ఇంటి నిర్మాణం ఇష్యూ ఏంటి..? హైకోర్టు ఏం చెప్పింది..?
మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని కొద్ది రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జీహెచ్ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవికి చెందిన జూబ్లీహిల్స్ నివాసంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన హైకోర్టు.. ఆయన నివాస నిర్మాణాలకు సంబంధించి దాఖలైన దరఖాస్తుపై చట్టబద్ధంగా …
Read More »వాన కబురు వచ్చేసిందండోయ్.. ఇకపై ఏపీలో నాన్స్టాప్ వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఈ ఏడాది 15 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినా.. ఇప్పటివరకు తక్కువ వర్షపాతమే నమోదైంది. తెలంగాణ, ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ఈరోజు :- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు …
Read More »మూడున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోవడం ఖాయం… ప్రెస్మీట్లో జగన్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని అరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు జగన్. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉండేది వైసీపీనేనని గుర్తు చేశారు. రైతుభరోసా నిధుల కోసం అన్నదాతకు అండగా ధర్నా చేశామన్నారు. కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పోరుబాట చేపట్టామని జగన్ చెప్పుకొచ్చారు. యువత పోరు పేరుతో ఆందోళనలు చేపట్టాం.. చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం నిర్వహించాం.. బాబు షూరిటీ-మోసం …
Read More »పసిడి ప్రియులకు ఎగిరి గంతేసే న్యూస్.. దిగొచ్చిన ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..
మగువలు పసిడి ప్రియులు. పండగలు, ఫంక్షన్లకు ఒంటినిండా బంగారు నగలు ధరించి మురిసిపోతుంటారు. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు కొండెక్కి కూర్చోవడంతో గోల్డ్ కొనలేని పరిస్థికి వచ్చింది. కానీ బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) స్పష్టం చేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే మరింతగా దిగొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇందుకు శుభశూచకంగా మంగళవారం (జులై 16) బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 …
Read More »అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేత పొగడ్తల వర్షం… గవర్నర్ పదవి ఇవ్వడంపై అప్పలనాయుడు హర్షం
గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేత పొగడ్తల వర్సం కురిపించారు. గవర్నర్ పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు వైసీపీ నెల్లిమర్ల ఇన్చార్జ్ బడ్డుకొండ అప్పలనాయుడు. గజపతిరాజు ఈ ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిన మహానుభావులు అంటూ కొనియాడారు. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టే ఉన్నతమైన పదవులు దక్కాయని చెప్పారు వైసీపీ నేత అప్పలనాయుడు. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ కావడం సంతోషంగా ఉందన్నారు. అశోక్ గజపతిరాజు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నారని అన్నారు. పదవి ఇచ్చిన బీజేపీకి ధన్యవాదాలు …
Read More »ఏపీపీఎస్సీ 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్.. నేటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టులు 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులు 435 వరకు ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ …
Read More »తెలుగు సీఎంలతో జలశక్తి శాఖ సమావేశంపై ఉత్కంఠ… బనకచర్లపై చర్చకు ససేమిరా అంటున్న తెలంగాణ
తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ దిల్లీకి చేరింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి అంశాలకు సంబంధించి జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. బనకచర్ల ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు కోరారు. కృష్ణా, గోదావరి నది జలాల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర జలశక్తి శాఖ. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల …
Read More »మిథున్రెడ్డిపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ… విదేశాలకు వెళ్లకుండా ముందస్తు చర్యలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయింది. మిథున్ రెడ్డిపై నమోదైన లిక్కర్ కేసులో ఇప్పటికే హై కోర్టులో బెయిల్ పిటిషన్ డిస్ మిస్ అయింది. బెయిల్ పిటిషన్ డిస్ మిస్ కావడంతో విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ సర్కులర్ జారి చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. మద్యం అమ్మకాల్లో ఆన్ లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడల్ గా మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక …
Read More »ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే చాలు!
ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) మరో భారీ శుభవార్త చెప్పింది. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా ఇందుకు సంబంధించి షార్ట్ నోటీస్ జారీ చేశారు. విద్యార్హత, వయోపరిమితి, జీతం, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్ను జులై 19వ తేదీ ఐబీ (IB) అధికారిక వెబ్సైట్లో పొందుపరచనుంది.. భాతర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) మరో …
Read More »