RBI కీలక నిర్ణయం.. దూసుకెళ్లిన ప్రముఖ బ్యాంక్ స్టాక్.. ఒక్కరోజే 10 శాతానికిపైగా జంప్!

Bank Stock: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన బంధన్ బ్యాంక్ (Bandhan Bank) స్టాక్ ఇవాళ దూసుకెళ్తోంది. మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే లాభాల బాట పట్టిన ఈ బ్యాంక్ షేరు.. 10 శాతానికిపైగా పెరిగి ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయానికి 10.86 శాతం లాభంతో రూ.208.08 వద్ద కొనసాగుతోంది. ఈ స్టాక్ ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ఇంట్రాడే హై స్థాయి రూ.209.50 ని తాకి కాస్త వెనక్కి తగ్గింది. బంధన్ బ్యాంక్ స్టాక్ ఇవాళ రాణించేందుకు ఓ ప్రధాన కారణం ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

బంధన బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. జూలై 9వ తేదీన చంద్ర శేఖర్ ఘోశ్ ఈ పదవుల నుంచి వైదొలిగారు. ఆ తర్వాత రతన్ కేశ్‌ను తాత్కాలిక ఎండీ, సీఈఓగా నియమించారు. అయితే, ఇప్పుడు పూర్తి స్థాయి బాధ్యతలను ప్రతిమ్ సేన్‌కు బ్యాంక్ అప్పగించింది. అక్టోబర్ 8వ తేదీనే ఆయన నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ పదవుల్లో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారని తెలిపింది. అంతకు ముందు ప్రతిమ్ సేన్ గుప్తా 2016-2018 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోల్‌కతా సర్కి‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 2020లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ పని చేశారు. 2022 డిసెంబర్ వరకు ఆ పదవిలోనే కొనసాగారు.

ప్రతిమ్ సేన్ గుప్తా నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపినట్లు వార్తలు వెలువడిన క్రమంలో బంధన్ బ్యాంక్ షేరు రాణిస్తోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.263 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.169గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.33 వేల 380 కోట్లుగా ఉంది. క్రితం రోజు మార్కెట్ సెషన్‌లో ఈ స్టాక్ రూ.187 వద్ద ముగియగా.. ఇవాళ 10 శాతానికిపైగా పెరిగి ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తోంది.

About amaravatinews

Check Also

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *