మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్‌ రిలీఫ్.. ఆ కేసులో FIR కొట్టివేసిన హైకోర్టు!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉట్నూరు పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే, రూ.లక్షన్నర కోట్లతో చేపడుతోన్న మూసీ ప్రాజెక్ట్ దేశంలో అతిపెద్ద కుంభకోణం అంటూ ఉట్నూర్‌లో జరిగిన ఓ సభలో కేటీఆర్ ప్రస్తావించారు. దేశంలో రాబోయే ఎన్నికలకు కావలసిన నిధుల కోసం కాంగ్రెస్‌ మూసీ ప్రాజెక్టును వాడుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. అప్పుడు కేటీఆర్ చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీన ఉట్నూరు పోలీసులు కేటీఆర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కేటీఆర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *