బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫ్రైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కొత్త ఇన్నింగ్స్ను మొదలు పెట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొంది, లోక్ సభలో అడుగు పెట్టారు కంగన. పార్లమెంట్లో ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నారని, తన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆమె మద్దతుదారులు, ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఎంపీగా తన బాధ్యతలను కొనసాగిస్తూనే.. తాను స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు కంగనా. అయితే, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయ్యింది.
త్వరలోనే అన్ని అడ్డంకులను తొలగించుకుని తన ఎమర్జెన్సీ సినిమా రావడం ఖాయం అంటూ కంగనా మీడియా ముందు ఇటీవల ప్రకటన చేశారు. తాజాగా మరోసారి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమర్జెన్సీ గురించి కంగనా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తన పెళ్లిపై కూడా మీడియాలో వస్తున్న వదంతులకు క్లారిటీ ఇచ్చారు. పెళ్లిపై తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా తెలియజేశారు.
ఎంపీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంటారా అంటూ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘ఎంపీగా ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడి దయతో అది జరుగుతుందని అనుకుంటున్నాను. ఎంపీ పదవి పోయిన తర్వాత పెళ్లి చేసుకుని ఏం లాభం’ అంటూ కంగనా వ్యాఖ్యలు చేశారు.
Amaravati News Navyandhra First Digital News Portal