టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు సెమీస్ ఛాన్స్.. అదొక్కటే ఛాన్స్

ఆట ఏదైనా.. భారత్-పాకిస్థాన్ జట్లు ఎప్పటికీ దాయాదులే. కానీ మీరెప్పుడైనా అనుకున్నారా.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గెలవాలని భారత అభిమానులు కోరుకోవాల్సి వస్తుందని. కానీ వచ్చింది.. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో తన చివరి లీగ్ దశ మ్యాచులో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఇప్పటికీ సెమీ ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంది.

అదేలా అంటే.. ఈ గ్రూప్‌లో చివరి మ్యాచ్ ఇవాళ అంటే సోమవారం జరగనుంది. ఇందులో పాకిస్థాన్- న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇందులో పాకిస్థాన్ జట్టు గెలిస్తే.. భారత్ సెమీ ఫైనల్ చేరుతుంది. దీంతో ఇపుడు సగటు భారత అభిమాని.. పాకిస్థాన్ గెలవాలని కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ భారత్ సెమీ ఫైనల్ చేరాలంటే కేవలం పాకిస్థాన్ స్వల్వ మార్జిన్‌తోనే గెలవాలి. ఒకవేళ పాకిస్థాన్ భారీ విజయం సాధిస్తే భారత్, న్యూజిలాండ్‌లను వెనక్కి నెట్టి ఆ జట్టే ముందంజ వేసే అవకాశం ఉంది. అలా కాకుండా బొటాబొటీ వ్యత్యాసంతో గెలిస్తే మాత్రం భారత్ ముందంజ వేస్తుంది.

About amaravatinews

Check Also

ఐసీసీ బిగ్ షాక్‌.. యూఏఈతో మ్యాచ్‌కు నో చెప్పిన పాక్.. గ్రూప్ ఏ నుంచి సూపర్-4 చేరే జట్లు ఇవే?

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కరచాలన వివాదం తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మ్యాచ్ రిఫరీని తొలగించాలని డిమాండ్ చేసింది. డిమాండ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *