AP Rs 4 Lakhs For Construction Of House: ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ) 2.0 పథకానికి సంబంధించి 2024-25 నుంచి అమలుచేయనున్న మార్గదర్శకాలను సవరించారు. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం తెలిపింది. ఎన్నికలకు ముందే ఈ పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ను ఎన్నికల ముందే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు సంబంధించి …
Read More »పలు రాష్ట్రాలకు గవర్నర్లు నియమాకం.. తెలంగాణకు ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం
పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఆమోదం తెలిపారు. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లతో పాటు మరో ముగ్గుర్ని వేరే రాష్ట్రాల నుంచి బదిలీ చేశారు. తెలంగాణకు సీనియర్ బీజేపీ నేత, త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మ నూతన గవర్నర్గా నియమితులయ్యారు. మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభౌ కిసన్రావ్ బాగ్డేను రాజస్థాన్ గవర్నర్గా, కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ను ఝార్ఖండ్కు.కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ సి.హెచ్.విజయశంకర్ను మేఘాలయ గవర్నర్గా నియమించారు. రాజస్థాన్ …
Read More »తిరుమల నడక మార్గంలో కలకలం.. భక్తుడిని కాటేసిన పాము
కలియుగ వైకుంఠం తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వారిలో కొంతమంది సొంత వాహనాల్లో కొండపైకి చేరుకుంటే.. మరికొంత మంది ఆర్టీసీ బస్సు్ల్లో తిరుమల వస్తుంటారు. ఇక చాలా మంది భక్తులు నడకమార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. నడకమార్గంలో వచ్చే భక్తులలో చాలా మంది అలిపిరి నడక మార్గాన్ని ఎంచుకుంటే.. మరికొంత మంది శ్రీవారి మెట్టు గుండా కొండపైకి వస్తుంటారు. అయితే అటవీ ప్రాంతం కావటంతో …
Read More »యంగ్ మినిస్టర్.. మీ నాన్న నాకు క్లోజ్ ఫ్రెండ్.. లోక్సభలో ఆసక్తికర దృశ్యం
కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయడు.. మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాతో కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు.. మోదీ మంత్రివర్గంలో అతి పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే రామ్మోహన్ నాయుడు గురించి ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ …
Read More »ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ..
ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజులు ముందుగానే నిధుల విడుదలపై ఫోకస్ పెట్టింది. గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించగా.. ఈసారి కూడా వారే ఆగస్టు ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంగా తెలియజేశారు. అస్వస్థతతో ఉన్న వారు, ఇంకా పంపిణీ మిగిలితే 2న ఇస్తారు. ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. తిరుమలలో శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టికెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలన్నారు. ఇందుకోసం గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దాతల విభాగం ప్రక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ …
Read More »తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు ఈవో జే శ్యామలరావు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగంవారు అన్నప్రసాదం సిబ్బందికి, పెద్ద, జనతా క్యాంటీన్ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి హోటల్ లో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. తిరుమల …
Read More »ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతల బెంబేలెత్తిపోతున్నారు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతల బెంబేలెత్తిపోతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా తెల్లవారుజామున పాల వెంకటాపురంలో పొలం పనులకు వెళ్తున్న రైతులకు ఎలుగుబంటి కనిపించింది. తప్పించుకునే ప్రయత్నంలో రైతులు నానాతంటాలు పడ్డారు. ఎలుగుబంటి రైతుల మీద దాడి చేసేందుకు ప్రయత్నించగా రైతులంతా కలిసి గట్టి గట్టిగా అరుస్తూ.. శబ్దాలు చేస్తూ ద్విచక్ర వాహనాల్లో ఎలుగుబంటిని వెంబడించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతల బెంబేలెత్తిపోతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా తెల్లవారుజామున పాల వెంకటాపురంలో పొలం పనులకు …
Read More »వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 27, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు స్థిరంగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు చాలావరకు మారే అవకాశం ఉంది. …
Read More »సీఎం చంద్రబాబు పెద్ద మనసు.. వారందరికీ రూ.3 వేలు..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల్లో నీరు చేరి భారీగా వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో పలు జిల్లాలు తీవ్ర వరద ప్రభావానికి గురయ్యారు. దీంతో అక్కడ నివసించే జనజీవనం అస్తవ్యస్తం అయింది. పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో.. ప్రజలను సహాయక శిబిరాలకు తరలించింది. ఈ క్రమంలోనే వరద ప్రభావానికి గురై.. ఇళ్లు, వాకిలి వదిలేసి ప్రభుత్వ సహాయక …
Read More »