అంతర్జాతీయం

యుద్ధంలో పుతిన్‌కు షాక్.. 1000 చ.కి.మీ రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్

రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లారు. వారం రోజుల కిందట కుర్స్క్‌ రీజియన్‌లోకి ప్రవేశించిన కీవ్ సేనల దూకుడు ముందు మాస్కో సైన్యాలు తలవంచుతున్నాయి. రష్యా భూభాగాలను ఉక్రెయిన్ సైనికులు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. కస్క్‌ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్‌ సైనిక కమాండర్‌ జనరల్‌ ఒలెక్సాండర్‌ సిర్‌స్కీ ప్రకటించారు. అటు, రష్యాలోకి తమ సేనలు ప్రవేశించిన …

Read More »

రూ.12.5 కోట్ల విలువైన చికెన్ దొంగతనం.. మహిళకు 9 ఏళ్ల జైలు శిక్ష

Chicken Wings: మనం ఇంతవరకు ఎన్నో దొంగతనాలు చూసి ఉంటాం. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన వస్తువులు, సొమ్మును పక్కదారి పట్టించి.. జేబులు నింపుకుంటారు. ఇలా కోట్లకు కోట్లు కొట్టేసి.. చివరికి ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారు. అప్పుడు వాళ్లు కూడబెట్టిన ఆస్తులు చూస్తే.. వారి జీతానికి, ఆస్తులకు సంబంధమే ఉండదు. అయితే ఇలా దొరికిపోయిన వారిపై కేసులు, శిక్షలు అంటూ పెద్ద తతంగం ఉంటుంది. అయితే విద్యార్థులకు అందాల్సిన చికెన్ ముక్కలను కొట్టేసిన ఓ మహిళ.. చివరికి కటకటాల వెనక్కి …

Read More »

మంటల్లో జపోరిజియా అణువిద్యుత్ ప్లాంట్‌.. అంతర్జాతీయ సమాజం ఆందోళన

ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కర్మాగారంలో మంటలు చెలరేగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన‌ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉంది. దీనిపై రష్యా, ఉక్రెయిన్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రష్యా సైన్యమే ఈ పేలుళ్లకు పాల్పడినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. కీవ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి ఈ చర్యకు తెగబడ్డారని ఆయన మండిపడ్డారు. అటు, ఉక్రెయిన్‌ దళాలు ప్రయోగించిన శతఘ్నుల వల్లే మంటలు వ్యాపించాయని మాస్కో ప్రత్యారోపణలు చేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ …

Read More »

కష్టకాలంలో షేక్ హసీనాకు సాయం.. కేంద్రంపై శశిథరూర్ ప్రశంసలు

కష్ట సమయంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఓ స్నేహితుడిగా ఆమెకు భారత్ సహయం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి..బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై జాతీయ మీడియాతో తిరువనంతపురం ఎంపీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో అధికార మార్పిడి విషయంలో భారత్ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం …

Read More »

స్వింగ్‌ స్టేట్స్‌లో కమలా హ్యారిస్ దూకుడు.. పోల్ సర్వేల్లో ట్రంప్‌పై ఆధిక్యం

గతంలో ఎన్నడూలేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వం నుంచి అనూహ్యంగా జో బైడెన్ తప్పుకోవడం.. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీకి వచ్చారు. ఆగస్టు 19న జరిగే డెమొక్రాటిక్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కమలా పేరును లాంఛనంగా ప్రకటించున్నారు. ఎన్నికలకు మరో మూడు నెలలే సమయం ఉండగా.. డెమొక్రాట్లకు అన్నీ శుభశకునాలే ఎదురవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పోల్‌ సర్వేల్లో రిపబ్లికన్ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్‌ …

Read More »

మా శత్రువుకు సాయం చేస్తే భారత్‌తో సహకారం కష్టమే.. బీఎన్పీ

షేక్ హసీనాకు భారత్ సాయంపై ఆమె ప్రత్యర్ధి పార్టీ బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు సోమవారం వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు భారత్‌లో తాత్కాలిక ఆశ్రయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీఎన్పీ సీనియర్ నేత, బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్ స్పందించారు. బంగ్లాదేశ్, భారత్ మధ్య పరస్పర సహకారం ఉండాలని బీఎన్పీ బలంగా నమ్ముతుందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తిని అనుసరించే విషయంలో …

Read More »

హసీనాకు రక్షణగా రఫేల్ జెట్లు పంపి.. విమానానికి భద్రత కల్పించిన భారత్‌

రిజర్వేషన్ల కోటాపై గత నెల రోజులుగా బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలను నిశితంగా గమనించి భారత్‌.. సోమవారం తీవ్రరూపం దాల్చి ప్రధాని షేక్‌ హసీనా (sheikh Hasina ) పదవి నుంచి తప్పుకోవడంతో మరింత అప్రమత్తమైంది. సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సైన్యం 45 నిమిషాలే సమయం ఇవ్వడంతో ఆమె భారత్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత భద్రతా దళాలు గగనతలంపై నిఘా పెంచాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రాడార్లు …

Read More »

బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా 26 ఏళ్ల నహిద్ ఇస్లామ్.. రేసులో భారత వ్యతిరేకి కూడా!

Nahid Islam: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని ఏలిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇక ప్రస్తుతం సైనిక పాలనలో ఉన్న బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన 26 ఏళ్ల నహీద్ ఇస్లామ్ కొత్త ప్రధాని రేసులో ఉన్నారు. నహీద్ ఇస్లామ్‌తోపాటు మాజీ ప్రధానమంత్రి, షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా, …

Read More »

బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవదహనం.. 440కి చేరిన మృతులు

బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు ఆగడం లేదు. ఇప్పటికే ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి పారిపోయినా అక్కడ ఆందోళనలు మాత్రం చల్లారడం లేదు. దేశం మొత్తాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నా.. నిరసనకారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 440 కి పెరిగింది. తాజాగా ఓ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పుపెట్టడంతో.. అందులో ఉన్న 24 మంది సజీవ దహనం అయ్యారు. ఆ హోటల్‌లో ఇండోనేషియాకు చెందిన ఓ పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. …

Read More »

బంగ్లా అల్లర్లకు కారణం అదే.. షేక్ హసీనాను పారిపోయేలా చేసిన కోర్టు తీర్పు ఏంటి?

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో 300 మందికిపైగా మృత్యువాత పడగా.. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. అయితే మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు.. ఆ తర్వాత మరింత ఉద్ధృతమై చివరికి హింసాత్మకంగా మారడంతో.. ఏకంగా ప్రధాని పీఠమే కదిలిపోయింది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్‌ రోజురోజుకూ పెరిగి.. ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో.. షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి …

Read More »