ఆంధ్రప్రదేశ్

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. కారును ఢీకొట్టిన తరువాత కారును చాలా దూరం వరకు లాక్కెంది టిప్పర్‌.. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ కారును ఢీ కొట్టినట్లు చెబుతున్నారు పోలీసులు. కారు నెంబర్ AP 40HG 0758 నెల్లూరుకి చెందిన తాళ్లూరు రాధ పేరు …

Read More »

‘డీఎస్సీ పోస్టింగుల్లో ప్రాధాన్యం వ్యవహారాన్ని తేల్చాల్సిందే’.. హైకోర్టు ధర్మాసనం

మెగా డీఎస్సీ ఉద్యోగ నియామకాలు దాదాపు ముగిసిన దశలో ఉండగా.. హైకోర్టులో కొందరు పిటీషన్లు వేశారు. పోస్టుల ప్రాధాన్యం వ్యవహారాన్ని తేల్చాలంటూ పిటీషనర్లు ఇందులో కోరారు. వీటిని తాజాగా విచారించిన కోర్టు దరఖాస్తు దాఖలు సమయంలోనే అభ్యర్థుల నుంచి పోస్టుల ప్రాధాన్యం (ప్రిఫరెన్స్‌) ఐచ్ఛికాన్ని కోరడం సరికాదని.. రాష్ట్రంలో కూటమి సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ దాదాపు ముగిసిన దశలో హైకోర్టులో కొందరు పిటీషన్లు వేశారు. పోస్టుల ప్రాధాన్యం వ్యవహారాన్ని తేల్చాలంటూ పిటీషనర్లు ఇందులో కోరారు. వీటిని తాజాగా విచారించిన …

Read More »

నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీపీఎస్సీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల! రేపట్నుంచే దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన ఆరోగ్య సేవలు.. పట్టు వీడాలంటున్న ప్రభుత్వాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవలు మూడు రోజులుగా నిలిచిపోయాయి. రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. వారంలోగా సమస్య పరిష్కరించాలని కోరారు. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేతకు బకాయిలు ఒక కారణం అయితే.. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మరో కారణంగా తెలుస్తోంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల చికిత్స ప్రతిపాదనతో.. స్కీమ్ తీసుకురాబోతుంది ఏపీ ప్రభుత్వం. అయితే కొత్త హైబ్రీడ్ విధానంలో తమనూ …

Read More »

మెగా డీఎస్సీలో జాబ్‌ మిస్‌ అయిన వారికి మరో ఛాన్స్‌! నవంబరులో కొత్త టెట్ నోటిఫికేషన్‌..

ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో దాదాపు చాలా మంది పరిస్థితి ఇదే. మార్కులు దండిగా వచ్చినా జాబ్‌ దక్కలేదు. అయితే ఇలాంటి వారికి ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులకు కలిపి కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ యేటా ప్రకటిస్తామని ఇప్పటికే.. గంపెడు ఆశతో రాత్రింబగళ్లు చదివినా.. అదృష్టం ఎల్లప్పుడూ కొందరినే వరిస్తుంది. అయినా నిరుత్సాహ పడకుండా పట్టుదలతో మళ్లీ మొదలు పెడితేనే విజయం వరిస్తుంది. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో దాదాపు చాలా మంది పరిస్థితి ఇదే. మార్కులు …

Read More »

మెగా డీఎస్సీ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది! ఇంతకీ ఎప్పట్నుంచంటే

విద్యాశాఖ మొత్తం 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేయగా 3,36,300 మంది నుంచి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ మెగా డీఎస్సీలో ఏకంగా 49.9% మంది మహిళలు సత్తా చాటారు. అన్నిరకాల పోస్టులకు కలిపి 15,941 మంది ఎంపికయ్యారు. ఇందులో 7,955 మంది మహిళలే ఉండటం.. డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితాను ఇప్పటికే విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మొత్తం 16,347 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా 3,36,300 మంది …

Read More »

ఇకపై యేటా DSC నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ.. మంత్రి నారా లోకేష్‌ వెల్లడి

ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ అన్నారు. డీఎస్సీలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దని, ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్ధులు పట్టుదలతో సిద్ధంకావాలని, అవకాశం తప్పకుండా వస్తుందని అన్నారు. ఇక తుది జాబితాలో చోటు.. రాష్ట్రంలో కూటమి సర్కార్‌ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మెగా డీఎస్సీని విజయవంతంగా నెరవేర్చింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నియమక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇందులో 15,941 పోస్టులు భర్తీకాగా.. 406 మిగులు పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి …

Read More »

ఏపీలోని ఈ జిల్లాలకు 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. మళ్లీ బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా కామ్‌గా ఉన్న వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో మళ్లీ కుండపోత మొదలైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరి వచ్చే ౩ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. దక్షిణ అంతర కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి విస్తరించి ఉంది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి గాలులు వీస్తున్నాయి. …

Read More »

మరో వ్యక్తితో భార్య ఆ యవ్వారం.. వామ్మో.. మద్యం తాగించి భర్త ఏం చేశాడో తెలుసా..?

గుంటూరు నగరంలోని సీతమ్మకాలనీకి చెందిన రామాంజినేయులు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 6 వ తేదిన ఇంటి నుండి వెళ్లిపోయిన రామాంజినేయులు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య శివ పార్వతికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామాంజినేయులు అదృశ్యంపై మొదట పోలీసులు మిస్సింగ్ నమోదు చేశారు. అయితే ఆ తర్వాత శివ పార్వతి అదే కాలనీకి చెందిన కొండయ్యపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన నగరంపాలెం పోలీసులు కొండయ్యను అదుపులోకి తీసుకొని …

Read More »

మనిషి పుర్రె, ఎముకలతో వినూత్న నిరసన.. ఎందుకో తెలుసా?

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తమ సమస్యలను పరిష్కరించాలని మాల బేగరిలీలు వినూత్న నిరసనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మాల బేగరీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహా గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మనిషి పుర్రెలు, ఎముకలతో పాటు స్మశాన వాటికలో బేగరులు ఉపయోగించే పని ముట్లను చేత పట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మనిషి పుర్రెలు, ఎముకలతో పాటు స్మశాన వాటికలో బేగరులు ఉపయోగించే పని ముట్లను …

Read More »