ఆంధ్రప్రదేశ్

వారెవ్వా.. ఏపీకి కావాల్సింది ఇదికదా.. అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..!

అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ 60 శాతం నిధులు అందిస్తున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం మిగతా ఖర్చు భరిస్తుంది. 2027 నాటికి పూర్తి కానున్న ఈ స్టేడియంలో సంవత్సరానికి 10 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగనున్నాయి. భవిష్యత్తులో ఏపీకి ఐపీఎల్ టీమ్ కూడా లభించే అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అమరావతిలో స్టేడియం నిర్మించాలని ఏపీ మంత్రి నారా లోకేష్‌, బీసీసీఐ కార్యదర్శి జైషాను కలిసిన సమయంలో కోరారు. దీంతో.. …

Read More »

ఆర్థికంగా చితికిపోయినా రాష్ట్రాన్ని ఆదుకోండి.. ఆర్థిక సంఘానికి ఏపీ సీఎం విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. అభివృద్ధికి ఊతమిచ్చేలా సాయం చేయాలని ఆర్థిక సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. 10 నెలలుగా తీసుకున్న చర్యలు.. అమలు చేసిన విధానాలను వివరించారు. అలాగే రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వివరిస్తూ వీడియో ప్రదర్శించారు. ఆర్థికంగా చితికిపోయినా రాష్ట్రాన్ని ఆదుకోండి.. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌నిర్మాణానికి అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘం సభ్యులను కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీని ప్రత్యేకంగా చూసి ఆర్థికంగా సాయం చేయాలన్నారు. స్వర్ణాంధ్ర 2047ప్రణాళికకు భరోసానివ్వాలని కోరారు. రాష్ట్ర ఆర్థికస్థితి, రెవెన్యూలోటు, కొత్త …

Read More »

అతి సామాన్య నేత.. సాదాసీదాగా జీవిస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇకలేరు..!

కర్నూలు జిల్లా ఆలూరు మాజీ శాసనసభ లోక్‌నాథ్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. హైదారాబాద్ మల్లారెడ్డి ఆసుపత్రిలో బుధవారం(ఏప్రిల్ 16) మధ్యాహ్నం చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతకకాయాన్ని సొంత గ్రామం ఆలూరు మండలం మొలగవళ్లి గ్రామానికీ తీసుకొనే వచ్చే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. లోక్ నాథ్ మరణవార్త వినిన వెంటనే తన సొంత గ్రామం మొలగవల్లి అలాగే ఆలూరు లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లోక్‌నాథ్ మొలగవళ్లి గ్రామంలో విద్యను అభ్యసించారు. అప్పట్లోనే ఓల్డ్ SSLC వరకు చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం …

Read More »

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?

జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌-1 (బీఈ/ బీటెక్‌) పరీక్షలు, ఏప్రిల్‌ 9వ తేదీన పేపర్‌-2ఏ, 2బీ (బీఆర్క్‌/బీ ప్లానింగ్‌) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని …

Read More »

3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్‌ ద్వారా జిల్లాలవారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 20 వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ 26న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీలో మంత్రులకు క్లాస్‌ తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను మంత్రులు …

Read More »

మే 2న అమరావతికి ప్రధాని మోదీ.. రాజధాని పునః నిర్మాణ పనులకు శ్రీకారం..

తెలుగు ప్రజలందరూ ఎప్పటినుంచో ఉత్కంఠగా ఎదురు చూసే సమయం రానే వచ్చింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విచ్చేయనున్నారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓ కీలక మలుపుగా నిలవనుంది. ఎందుకంటే, చాలా కాలంగా ఎదురుచూస్తున్న అమరావతి పునఃనిర్మాణ పనులకు మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ పర్యటన నిర్ధారణ కాగానే ముఖ్యమంత్రి కార్యాలయం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యటనపై మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి, …

Read More »

ఆరేళ్లుగా పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు.. కట్‌చేస్తే.. కటకటాలపాలయ్యాడు!

2019 నుంచి పోలీసులకు చిక్కకుండా, దారి దోపిడీలు, దౌర్జన్యాలు, దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాడికి నంద్యాల పోలీసులు చెక్‌ పెట్టారు. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత పాణ్యం మండంలోని సుగాలిమెట్ట గ్రామంలో చెంచు హనుమంతు అనే కేటుగాడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అతను కరుడు గట్టిన నిందితుడు, ఒకటి రెండు కాదు ఏకంగా 22 కేసుల్లో ముద్దాయి.  2019 నుంచి నంద్యాల,  గుంటూరు జిల్లాల్లో యదేచ్చగా దారి దోపిడిలు, చోరిలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న చెంచు హనుమంతును ఎట్టకేలకు నంద్యాల పోలీసులు అరెస్టు చేసి …

Read More »

గుమ్మడి, నిమ్మ, కొబ్బరికాయలతో అమ్మవారికి సాత్విక బలి.. శ్రీశైలంలో కన్నుల పండగ!

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన తొలి మంగళవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి,  ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ, జపపారాయణలను నిర్వహించారు. తరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం అర్చకులు ఏకాంతంగా ఈ పూజలన్ని నిర్వహించిన తర్వాత అమ్మవారికి మొదటి విడత సాత్వికబలిగా వందల సంఖ్యలో గుమ్మడి కాయలు, కొబ్బరికాయలలు, నిమ్మకాయలను ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు సమర్పించారు. మల్లికార్జునస్వామికి మహామంగళ హారతి తర్వాత …

Read More »

సముద్రంలో నేటి నుంచి వేట నిషేధం అమలు… ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. జూన్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ రెండు నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. అందుకే రెండు నెలల పాటు వేటను ఆపేస్తారు.సముద్ర తీరప్రాంతంలో ఉండే మత్స్యకారులు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తుంటారు. కాని ప్రతిఏటా 61 రోజులు పాటు వేట నిషేధం అమలులో ఉంటుంది. దీన్ని అతిక్రమిస్తే సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం – 1944 …

Read More »

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మరోవారంలోనే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంతవత్సరానికి ఏప్రిల్ 1వ తేదీన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇక జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమవగా.. ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. ప్రస్తుతం మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేస్తున్నారు. ఇది కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. దీంతో వారంలోపు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని సవ్యంగా కుదిరితే …

Read More »