ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల పేషీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల పేషీల్లోకి కొత్తగా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీ) ప్రకటన విడుదల చేసింది. 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లను, 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్లను నియమించబోతున్నట్లు తెలిపారు. వీరిని అవుట్సోర్సింగ్/తాత్కాలిక విధానంలో మంత్రులు పేషీల్లోకి తీసుకుంటారు. ప్రభుత్వం సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్కి విద్యార్హతను బీఈ/బీటెక్గా నిర్ణయించింది.. వీరికి నెలకు రూ.50 వేల జీతం ఇస్తారు. …
Read More »ఏపీ కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ బర్త్ డే ప్రస్తావన.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మంత్రులు చంద్రబాబు రాజకీయ జీవితం, పవన్ కళ్యాణ్ బర్త్ డే అంశాలను ప్రస్తావించారు. సెప్టెంబరు ఒకటో తేదీకి చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 30 ఏళ్లవుతోందని మంత్రి రామానాయుడు ప్రస్తావించారు. వెంటనే మంత్రులు చంద్రబాబుకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టిన శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబరు …
Read More »కొత్త రేషన్ షాపుల ఏర్పాటు.. రివర్స్ టెండరింగ్, ఎస్ఈబీ రద్దు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు.. మళ్లీ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు ఓకే చెప్పగా.. ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇచ్చే పట్టాదారు …
Read More »చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై నో సీక్రెట్, ఈ నెల 29 నుంచి ప్రజలకు అందుబాటులో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయిచింది.. ఈ మేరకు ఈ నెల 29 నుంచి ప్రభుత్వం జారీచేసే ప్రతి జీవోనూ జీవోఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అంటే ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో ప్రజలకు అందుబాటులో ఉంటుంది.. వారు స్వేచ్ఛగా జీవోలను చూడొచ్చు. జీవోఐఆర్ పోర్టల్కు సంబంధించి సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో సచివాలయంలోని ప్రతి సెక్షన్లోనూ జీవోలకు మాన్యువల్ రిజిస్టర్లు నిర్వహించేవారు. కచ్చితంగా వాటిలో నంబరు రాసి, జీవోలు విడుదల …
Read More »ఏపీలో వారందరికి గుడ్న్యూస్.. ప్రతి నెలా రూ.10వేల నుంచి రూ.15 వేలకు పెంపు
ఆంధ్రప్రదేశ్లో అర్చకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకుల వేతనాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. రూ.50వేలకుపైన ఆదాయం ఉన్న ఆలయాల్లో ప్రతి నెలా రూ.10 వేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 1,683 మంది లబ్ధిపొందనున్నారు. అమరావతి సచివాలయంలో దేవదాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని కూడా సూచించారు. …
Read More »ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …
Read More »టీటీడీ ఛైర్మన్గా ఎవరూ ఊహించని వ్యక్తి.. ఏపీ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ వైరల్, 25మందికి పదవులు!
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.. త్వరలోనే అధికారికంగా జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలువురికి నామినేటెడ్ పోస్టులు ఖాయం అయ్యాయంటూ ఓ జాబితా వైరల్ అవుతోంది. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతల పేర్లుో ఈ లిస్టులో ఉన్నాయి. టికెట్ దక్కని నేతలు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి ప్రాధాన్యం …
Read More »ఏపీలో నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ప్రభుత్వమే ఉచితంగా, మంత్రి కీలక ప్రకటన
ఏపీలో డీఎస్సీకి సిద్ధమవుతున్న వారికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. త్వరలో డీఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని.. అన్ని జిల్లా కేంద్రాల్లో మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్య పథకంతోపాటు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన అన్ని ఎస్సీ సంక్షేమ పథకాలనూ పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ అధికారులతో మంత్రిమ సెమినార్, సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమశాఖ వసతి …
Read More »పవన్ చెప్పినా బేఫికర్!
కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు! వద్దన్న పని చేయడానికే సిద్ధమవుతున్నారు.. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వీడడంలేదు! కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన బయో వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటులో సీపీసీబీ మార్గదర్శకాలకు తూట్లు విజయనగరంలో వైసీపీ నేత కంపెనీకి అనుమతివ్వాలని నిర్ణయం అడ్డగోలు అనుమతికి డిప్యూటీ సీఎం నో అయినా ఫైలు నడుపుతున్న అధికారులు భారీగా ముడుపులు తీసుకోవడమే కారణం అప్పిలేట్ అథారిటీ ఆదేశాలు బేఖాతర్ సీపీసీబీ వ …
Read More »Employees transfers: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. గైడ్లైన్స్ విడుదల.. వారికి మాత్రం!
AP Govt Employees transfer Guidelines: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎన్ని రోజులుగానో ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీలకు ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై గైడ్లైన్స్ విడుదల అయ్యాయి. మొత్తం 12 శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీలకు వీలుగా ఆగస్టు 19 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అన్ని ప్రభుత్వ …
Read More »