అమరావతి

ఏపీలో రైతులకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు, రాయితీపై తక్కువకే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాన్ని మళ్లీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతులకు మళ్లీ వ్యక్తిగత రాయితీపై యంత్రపరికరాలు అందజేస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతులకు ట్రాక్టర్లు, పవర్‌స్ప్రేయర్లు, టార్పాలిన్లు, యంత్ర పరికరాలెన్నో రాయితీపై అందించనున్నారు. అలాగే ఆధునిక టెక్నాలజీతో డ్రోన్లు కూడా అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులు వ్యక్తిగత యంత్ర పరికరాలకు ఆదరణ చూపిస్తున్ారు.. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లతోపాటు …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ ఇవన్నీ ఉచితంగా ఇస్తారు

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత టీడీపీ హయాంలో పథకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. 2014-2019 మధ్య పండగులకు కానుకలు అందించారు.. ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్‌కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు, చంద్రన్న రంజాన్‌ తోఫా పథకాలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. సంక్రాతి, క్రిస్మస్, రంజాన్ తోఫాలను రేషన్‌కార్డుదారులందరికీ ఉచితంగా చంద్రన్న కానుకలు అందిస్తారు. ఈ పథకానికి ఏడాదికి రూ.538 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.2,690 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రాథమికంగా ప్రభుత్వం …

Read More »

ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం

CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం రేసులోకి అనూహ్యంగా ఆయన.. ఈ సారి ఛాన్స్ ఆ జిల్లాకేనా?

నామినేటేడ్ పోస్టులు సహా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పదవుల భర్తీపై ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు నేతలతో చర్చించారు. పొలిట్ బ్యూరో సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. విడతల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమయంలోనే మరో కీలక పదవిని రాయలసీమకు చెందిన ఆ నేతను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా …

Read More »

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్.. ఆ రోజే చంద్రబాబు రివ్యూ.. ఆ డేట్ ఫిక్సా?

ఏపీలో మహిళలకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. ఈ విషయాన్ని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆగస్ట్ 12వ తేదీన ఆర్టీసీ, రవాణాశాఖపై చంద్రబాబు సమీక్షిస్తారని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుపైనా చంద్రబాబు చర్చిస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం త్వరలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి …

Read More »

ఏపీలో వాలంటీర్లకు మరో షాక్.. సాయంత్రం వరకు ప్రభుత్వం డెడ్‌లైన్, సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉండే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లను అలర్ట్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశ్యంతో ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్‌ చేసిన వాలంటీర్‌ వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపులను తక్షణమే డిలీట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వా హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు స్వయంగా తమ క్లస్టర్‌ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్‌ గ్రూపులను, …

Read More »

ఏపీ కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా.. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.. ఆగస్టు 7న సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ …

Read More »

ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్.. పంపిణీపై మార్గదర్శకాలు విడుదల

ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. జులై నెలాఖరుకు వచ్చిన నేపథ్యంలో ఆగస్ట్ నెలలో పింఛన్ల పంపిణీకై టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్ట్ నెల ఒకటో తేదీనే 99 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. తొలి రోజే 99 శాతం మందికి …

Read More »

ప్రతిపక్ష నేత హోదా కోరుతూ వైఎస్ జగన్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏజీ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ విన్నవించారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్‌ జగన్‌ తరఫున లాయర్ తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని.. …

Read More »

జనసేన పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు.. 

జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌‌గా రాష్ట్ర పార సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శాసన సభాపతికి డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ సమాచారం అందించారు. పార్టీ చీఫ్‌ విప్‌‌గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్భులుగా విశాఖ సాత్‌ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ , రాజోలు ఎమ్మెల్యే …

Read More »