కర్నూలు

బహిరంగ క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే.. ఎందుకంటే!

ఇంటింటికి పార్థసారథి కార్యక్రమంలో భాగంగా ఈనెల 16న కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్‌ను అవమానించాననే ఆరోపణలపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. తానకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. తెలియకుండా తానేవరినైనా బాధపెట్టి ఉంటే బహిరంగ క్షమాపణలు చెబుతున్నాని ఆయన అన్నారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆదోని నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పార్థసారథి. ఈ క్రమంలో ఈయన తాజగా ఇంటింటికి పార్థసారథి అనే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా …

Read More »

గోదాంలో రేషన్ బియ్యం బస్తాలు సీజ్.. కట్ చేస్తే.. తెల్లారి రెవెన్యూ అధికారులు లెక్కపెట్టగా..

కర్నూలు జిల్లా ఆదోనిలో సిరిగుప్ప రోడ్డులోని గోదాములో రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు సివిల్ సప్లై డైరెక్టర్ దృష్టికి వచ్చింది. ఆ వెంటనే మహేష్ నాయుడు అధికారులతో కలిసి తనిఖీ చేశారు. 1800 బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు గుర్తించారు. ఆ సమయంలో పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. సీజ్ చేయాలని సూచించి డైరెక్టర్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు ఉదయమే 1800 బస్తాలకు బదులు కేవలం 109 బస్తాలు మాత్రమే సీజ్ చేసినట్లు రెవెన్యూ పోలీస్ అధికారులు …

Read More »

జనావాసంలో చిరుత హల్ చల్.. రైతుకి తీవ్ర గాయం.. అటవీ శాఖ నిర్లక్షంపై మండిపాటు..

అడవుల్లో నుంచి జనావాసంలోకి వచ్చిన చిరుత పులి హల్చల్ చేసింది. చిరుతను బంధించేందుకు రైతులు పడిన కష్టమంతా అంతా కాదు. చివరకు ఓ రైతుపై చిరుత పంజా విసిరింది. తీవ్ర గాయం కావడంతో రైతులంతా ఏకమై చిరుతను వలలో బంధించారు. ఇదంతా గమనిస్తున్న రైతులు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.కర్నూలు జిల్లా కోసిగి తిమ్మప్ప, బసవన్న కొండల్లో చిరుతలు గత కొంతకాలంగా సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం బసవన్న కొండ వెనుక ఉన్న ఎర్ర వంకలో చిరుత పులి కనిపించింది. అనారోగ్య సమస్యతో …

Read More »

అతి సామాన్య నేత.. సాదాసీదాగా జీవిస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇకలేరు..!

కర్నూలు జిల్లా ఆలూరు మాజీ శాసనసభ లోక్‌నాథ్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. హైదారాబాద్ మల్లారెడ్డి ఆసుపత్రిలో బుధవారం(ఏప్రిల్ 16) మధ్యాహ్నం చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతకకాయాన్ని సొంత గ్రామం ఆలూరు మండలం మొలగవళ్లి గ్రామానికీ తీసుకొనే వచ్చే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. లోక్ నాథ్ మరణవార్త వినిన వెంటనే తన సొంత గ్రామం మొలగవల్లి అలాగే ఆలూరు లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లోక్‌నాథ్ మొలగవళ్లి గ్రామంలో విద్యను అభ్యసించారు. అప్పట్లోనే ఓల్డ్ SSLC వరకు చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం …

Read More »

ఆరేళ్లుగా పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు.. కట్‌చేస్తే.. కటకటాలపాలయ్యాడు!

2019 నుంచి పోలీసులకు చిక్కకుండా, దారి దోపిడీలు, దౌర్జన్యాలు, దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాడికి నంద్యాల పోలీసులు చెక్‌ పెట్టారు. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత పాణ్యం మండంలోని సుగాలిమెట్ట గ్రామంలో చెంచు హనుమంతు అనే కేటుగాడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అతను కరుడు గట్టిన నిందితుడు, ఒకటి రెండు కాదు ఏకంగా 22 కేసుల్లో ముద్దాయి.  2019 నుంచి నంద్యాల,  గుంటూరు జిల్లాల్లో యదేచ్చగా దారి దోపిడిలు, చోరిలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న చెంచు హనుమంతును ఎట్టకేలకు నంద్యాల పోలీసులు అరెస్టు చేసి …

Read More »

ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!

చదువంటే ఉద్యోగం తెచ్చిపెట్టే సాధనం మాత్రమే. అదే జీవితం కాదు. చదువులేని వారు కూడా ఎంతో మంది ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. వారిని స్పూర్తిగా చేసుకుని కూడా నచ్చిన రంగాల్లో రాణించవచ్చు. ఒక్క పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, అనుకునన్ని మార్కులు రాలేదనో జీవితాన్నే బలితీసుకోవడం ఎంత వరకు న్యాయం..రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసిన విద్యార్ధుల ఫలితాలు శనివారం (ఏప్రిల్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజా ఫలితాల్లో కొందరు విద్యార్ధులు ఫెయిల్‌ కావడంతో పలు చోట్ల వరుస ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ …

Read More »

బడిపంతులుగా మారిన కర్నూలు ఎంపీ.. క్లాస్ రూంలో కాసేపు ఇలా..

ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ తాను లెక్చరర్ గా పని చేసిన కళాశాలకు ఎం.పి హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు. లెక్చరర్ గా ఉద్యోగం మానేసిన తర్వాత సంవత్సరం పాటు బాధపడ్డానన్నారు.ఇంటర్ లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ ఆయన తాను , కెమిస్ట్రీ సబ్జెక్టు పై ఇష్టంతో కష్టపడి చదివి కెమిస్ట్రీ లెక్చరర్ అయ్యానన్నారు.ఇక విద్యార్థులు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు.కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు చాక్ పీస్ పట్టుకొని క్లాస్ రూంలో కాసేపు పాఠాలు చెప్పారు.ఎమ్మిగనూరు ప్రభుత్వ …

Read More »

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వలలో చిక్కిన మరో యువకుడు.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ నోట్!

ఆన్‌లైన్ బెట్టింగ్​ గేమ్స్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఇంట్లో ఒక్కరి వ్యసనం.. మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది. తాజాగా నంద్యాల జిల్లాలో బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. ఈక్రమంలోనే సదరు యువకుడు రాసిన సూసైడ్ లెటర్ కలకలం రేపుతుంది. కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది ఘటన.బెట్టింగ్‌ కాదది..బ్లాక్‌హోల్..! లోపలికి వెళ్లడమే తప్ప..బయటకు రావడమన్నదే ఉండదక్కడ. వందలు, వేలతో మొదలైన మాయాజూదం..చూస్తుండగానే లక్షలకు చేరుతోంది. ఆపై అప్పుల ఊబిలో చిక్కుకుని.. జేబులు గుల్లవుతాయి. అత్యాశతో కొందరు.. వ్యసనాల బారిన పడి మరికొందరు..ఆన్‌లైన్‌ …

Read More »

దేశ, విదేశాల కరెన్సీ.. 33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..

నేటికి కరెన్సీ సేకరణ ముమ్మరంగా కొనసాగుతుందని వినొద్ చెప్పారు.. భారత దేశ చరిత్రలో కరెన్సీ చలామణిలో అతి తక్కువ విలువ కలిగి పేరుగాంచిన బొట్టు, అణాతో పాటు దమ్మిడి, పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు ,పది పైసల నుంచి 1000 కాయిన్ వరకు నాణేలు సేకరించినట్లు తెలిపారు..కరెన్సీ సేకరణ ఆయన హాబి. అందుకే ఆయన అందరికంటే భిన్నంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.. కర్నూలు ఆత్మకూరు పట్టణానికి చెందిన దేవరశెట్టి వినోద్ కుమార్ అనే వ్యక్తి విభిన్నంగా ఆలోచించి కరెన్సీని 33 సంవత్సరాలుగా …

Read More »

అబ్బురపరుస్తున్న 400 ఏళ్ల నాటి రామదుర్గం చర్చి.. ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు

దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పురాతన చర్చిలున్నాయి. అలాంటి చర్చి ఒకటి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో ఉంది. ఈ చర్చికి నాలుగు శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. ఆలూరు మండలంలోని రామదుర్గం ప్రార్థన మందిరాన్ని 400 ఏళ్ల క్రితం నిర్మించారు.1780లో ఫాదర్ సెయింట్ రామదుర్గం చర్చిని గోవా రిజిస్టర్లో రాయించారు. ఇది జరిగిన తర్వాత 150 ఏళ్లకు ముందు.. ఆదోనికి చెందిన మినుములు చిన్న నాగప్ప పెద్ద నాగప్ప రామదుర్గంలో పునీత అన్నమ్మ …

Read More »