నంద్యాల

పవిత్ర శ్రీశైలంలో పట్టుబడిన మద్యం బాటిల్లు, అధికారులు ఏం చేశారో తెలిస్తే షాక్”

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఆలయ నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.ఇందులొ భాగంగానే శ్రీశైలం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండేళ్లలో 43 కేసులలో పట్టుబడిన మద్యం 1,197 బాటిళ్లు 186 లీటర్ల నాటు సారాయి శ్రీశైలం మల్లమ్మ కన్నీరు వద్ద డంపింగ్ యార్డ్‌లో ట్రాక్టర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మద్యం సారా ఇతర మత్తు పదార్థాలను సేవించడం నిషేధించారు. దేవదాయ ధర్మదాయ చట్ట ప్రకారం ఆలయ పరిసరాల్లో వాటిని నిషేధిస్తూ అమలు …

Read More »

శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అర్ధరాత్రి ఆలయ గర్భగుడి పై చక్కర్లు!

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం దగ్గర మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఆలయ పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. రాత్రి సమయంలో ప్రధాన ఆలయంపై డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. ఆలయ అధికారుల అనుమతిలేకుండా ఆలయంపై డ్రోన్లు చక్కర్లు కొడుతున్నా సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి బయటపడిన భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీశైలం క్షేత్ర పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. సోమవారం సెప్టెంబర్8 రాత్రి సమయంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి …

Read More »

అక్క స్కూల్‌కు వెళ్తుండగా వెంట వచ్చిన బాలుడు.. కాసేపటికే వెలుగు చూసిన దారుణం!

నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అక్క బస్సు ఎక్కేందుకు వెళుతుండగా ఆమె వెంటనే చూసేందుకు వచ్చిన బాలుడిని బస్సు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ముక్కుపచ్చలారని చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అక్క స్కూల్‌కు వెళ్తుండగా చూసేందుకు వచ్చి ప్రమాదానికి గురై తమ్ముడు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలోని అవుకు మండలం సుంకేసుల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన …

Read More »

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పిచ్చిన వ్యక్తిని పథకం ప్రకారం కత్తులతో పొడిచి చంపించేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 మందిని అరెస్ట్‌ చేశారు. నంద్యాల పట్టణానికి చెందిన పరుచూరి అశోక్ అనే వ్యక్తిని పథకం ప్రకారం పాణ్యం శివారులోని5 ఓ సోడ షాపు పిలిపించి కత్తులతో పొడిచి చంపిన ఘటనలో పోలీసులు పది …

Read More »

సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో వరుస దొంగతనాలు సంచలనం రేపుతున్నాయి. సాక్షాత్తు శ్రీశైలం ఆలయంలో పనిచేసే పరిచారకుడే తన చేతివాటం ప్రదర్శించాడు. శ్రీశైలం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ నుంచి 24,200 రూపాయలను దొంగలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. రోజువారి భద్రతా చర్యలలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాలలో మొత్తం 600 కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతీరోజు ఆలయ ఈఓ శ్రీనివాసరావు పలుమార్లు సి.సి. కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రధానంగా క్యూ కాంప్లెక్సు, …

Read More »

భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు గమనించాల్సిన విషయం ఇది. జలాశయం నిండడంతో భక్తుల రద్దీ పెరగడంతో.. ఈ వారం మధ్యాహ్నం సమయంలో కల్పించే ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ప్రకటించింది. పరిస్థితిని భక్తులు అర్థం చేసుకోవాలని కోరింది . ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వచ్చేవారికి దేవస్థానం కీలక సూచన చేసింది. ఈ వారం (మంగళవారం నుండి శుక్రవారం వరకు) ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇటీవల శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో జలాశయం నిండుకుండలా …

Read More »

నేడు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన… జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉ.10గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి నంద్యాల జిల్లా సున్నిపెంటలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 11.00 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. అనంతరం శ్రీ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మ.12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌ వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువన నాగార్జునసాగర్‌కు నీరు విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి మ.2:30 …

Read More »

 శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో స్పర్శ దర్శన టోకెన్‌లు!..

శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులకు శుభవార్త చెప్పారు. ఇటీవలే స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించిన అధికారులు తాజాగా ఈ దర్శనానికి టోకెన్‌ పద్దతిని ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. శ్రీశైలం మహా క్షేత్రంలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం జూలై 1వ తేదీ నుంచి స్పర్శ దర్శనం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పర్శదర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాటు, భక్తుల రద్దీ కూడా భారీ పెరిగింది. ఈ నేపథ్యంలో దీనిపై దృష్టి పెట్టిన ఆలయ అధికారులు …

Read More »

ఎట్టకేలకు భక్తులను కరుణించిన మల్లన్న.. నేటి నుంచి ప్రీ స్పర్శ దర్శనం ప్రారంభం.. టోకెన్ విధానం అమలు

ఎట్టకేలకు భక్తులను కరుణించిన పరమశివుడు. శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం నేటి నుండి ప్రారంభంకానుంది. భక్తుల కోరిక మేరకు ఉచిత స్పర్స దర్శనాలను దేవస్థానం అధికారులు మళ్ళీ ప్రారంభించారు. రోజుకు 1200 మంది భక్తులు స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది, నూతన టోకెన్ సిస్టం ద్వారా ఉచిత స్పర్శ దర్శనాలకు అనుమతించనున్నారు ఆలయ అధికారులు.నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం అవుతుందని శ్రీశైల …

Read More »

శివయ్యా ఇన్నాళ్లకు కరుణించావా..! శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం – ఎప్పటి నుంచి అంటే

శైవ భక్తులకు శుభవార్త చెప్పింది శ్రీశైలం దేవస్థానం. రోజుకు 1000 మంది చొప్పున శ్రీశైలంలో వెలసిన జ్యోతిర్లింగ స్పర్శ దర్శనానికి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ సదావకాశం గతంలో ఉన్నదే అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మధ్యలో బంద్ చేశారు. తర్వాత మళ్లీ ఇప్పుడు పునః ప్రారంభిస్తున్నారు. ప్రతివారం మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లోనే ఈ స్పర్శ దర్శనం ఉంటుంది. అయితే ఈ స్పర్శ దర్శనం కోసం భక్తులు విపరీతంగా తరలివచ్చే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల …

Read More »