ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో ఏమో.. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా రకరకాల వైరస్ లు వెలుగులోకి వస్తూ మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. తాజాగా జపనీస్ మెదడువాపు జ్వరం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ప్రకారం, ఢిల్లీలోని వెస్ట్ జోన్లోని బందీపూర్ ప్రాంతంలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఇది దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో …
Read More »నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్
మనం పుట్టక ముందు అంటే.. కోట్ల సంవత్సరాల క్రితం.. డైనోసర్ల కాలం మనుగడలో ఉండేది. ఆకారంలో భారీగా.. పెద్దవిగా ఉండే ఈ డైనోసర్ లాంటి జీవులు కొన్ని ఇప్పటికీ ప్రపంచంలోని నలుమూలల ఎక్కడొక చోట ఇంకా జీవనం సాగిస్తూనే ఉన్నాయి. ఇక వాటిలా ఉండే ఓ జీవి టైటానోబోవా పాము. దీనిని ‘మోన్స్టర్ స్నేక్’ అని కూడా పిలుస్తారు. భూమిపై ఉన్న అతి పెద్ద పాముల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. ప్రస్తుతం ఆఫ్రికా అడవుల్లో కనిపించే అనకొండల కంటే ఇవి చాలా పెద్దవి. మొసళ్లను …
Read More »Cyclone Fengal: వామ్మో.. తుఫాన్ గండం.. ఏపీ ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు
తమిళనాడు, ఏపీపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్గా మారనుంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నెమ్మదిగా కదులుతోంది.. గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 110 కి.మీ, నాగపట్నానానికి 310 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ, చెన్నైకి 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది.. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉదయంలోపు తుపానుగా …
Read More »సమస్య ఈవీఎంలది కాదు.. కాంగ్రెస్ పార్టీది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు..
ఏపీ, హర్యానా, మహారాష్ట్ర. ఎన్నికలు ఎక్కడ జరిగినా… ఈవీఎంలపై ఆరోపణలు రావడం మాత్రం మామూలైపోయింది. దీనిపై ఈసీ క్లారిటీ ఇచ్చినా.. మళ్లీ మళ్లీ ఆరోపణలు, అనుమానాలు మాత్రం ఆగడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎవరో ఒకరు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారుతుంది.. ఇప్పటికే.. ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చినా.. అందులో ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ నుంచి ఈ రకమైన ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. తాజాగా జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన …
Read More »AP Pharmacy Counselling: ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్లో ఫార్మసీ ప్రవేశాలు షురూ.. రేపట్నుంచి కౌన్సెలింగ్
ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది..ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్లో ఫార్మసీ ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 29 నుంచి 30 వరకు ఎంపీసీ స్ట్రీమ్లో, 30 నుంచి డిసెంబరు 5 వరకు బైపీసీ స్ట్రీమ్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఎంపీసీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 29 నుంచి డిసెంబరు 1 వరకు, బైపీసీ విద్యార్థులకు …
Read More »పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కుర్ర హీరో.. ఆ సినిమా ఎదో తెలుసా.?
పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఆయన లైనప్ చేసిన సినిమాల షూటింగ్స్ కూడా పూర్తి చేస్తున్నారు. పవన్ లైనప్ చేసిన సినిమాలు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఇక థియేటర్స్ దగ్గర పవన్ అభిమానులు చేసే హంగామా మాములుగా …
Read More »ఆకర్షిస్తున్న ఆ ఈవీ స్కూటర్ అప్డేటెడ్ వెర్షన్.. ధరెంతో తెలిస్తే షాక్..!
భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్లకు అత్యంత డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకు తమ ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీని అప్డేట్ చేసింది. ఈ అప్డేటెడ్ వెర్షన్లోని ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రివర్ ఇండీ అప్డేటెడ్ వెర్షన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. రివర్ ఇండీ అప్డేటెడ్ వెర్షన్ ధర ఇప్పుడు రూ.1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). …
Read More »మళ్లీ కొండెక్కిన కూరగాయలు.. కేజీ చిక్కుడు రూ.100, సొరకాయ రూ.50, టమాటా రూ.70
కార్తీక మాసం పుణ్యమాని కూరగాయల ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. మాంసాహారినిక సరిసమానంగా కూరగాయల ధరలు పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. కార్తీక మాసం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయినా బహిరంగ మార్కెట్లలో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సాధారణంగా కార్తీక మాసంలో మాంసాహారానికి చాలా మంది దూరంగా ఉంటారు. దీంతో ఈ నెల మొత్తం శాఖాహారమే తీసుకుంటారు. దీంతో ప్రతీయేట ఈ మాసంలో చికెన్, మటన్ ధరలు తగ్గుతుంటాయి. ఇక ఈసారి కూడా చికెన్ ధర రూ.180కి చేరింది. …
Read More »చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పం.. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్ క్లియర్
కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన అనంతరం ఏపీలోని చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ధ్యేయంగా.. పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు సీఎం చంద్రబాబు వ్యూహంతో ముందుకెళ్తున్నారు.. నక్కపల్లి మండలంలోని విశాఖ-చైన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో (వీసీఐసీ) పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.. ఈ క్రమంలోనే నక్కపల్లి మెడలో స్టీల్ నగ చేరబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్ సెల్లార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ ఇండియా కలిసి ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నాయి. లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ …
Read More »Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో మాయమవుతున్న శవాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
మార్చురీలో శవాల మాయానికి సంబంధించి అసిస్టెంట్ అశోక్పై ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు కావడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు.ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని అనాథ శవాల మాయం వ్యవహారంలో ఉచ్చు బిగుస్తోంది. మెడికల్ బోర్డు అధికారుల బృందం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం షాకిస్తోంది. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో మృతదేహాల మాయం కేసు ప్రకంపనలు రేపుతోంది. దీనికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషవ్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. డీఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారితోపాటు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal