ఆంధ్రప్రదేశ్

మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..

జులై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. టికెట్ల బుకింగ్‌కు సంబంధించి కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్, అన్ని ఏసీ బోగీల టికెట్ ధరలు పెరిగాయి. అయితే, సబర్బన్ ప్రయాణాలు, సీజన్ టికెట్లు, రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్ సర్ ఛార్జీలలో మాత్రం మార్పు లేదు. రైల్వే శాఖ కొత్తగా ప్రకటించిన సెకండ్ క్లాస్ ఆర్డినరీ రైళ్ల ధరలు.. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణాలకు సాధారణ ఛార్జీలు వర్తింపు. 501 కిలోమీటర్ల నుంచి …

Read More »

చేపల వేటకు వెళ్లాడు.. కట్ చేస్తే.. వల బరువెక్కడంతో సరాసరి నీటిలోకే.. ఆ తర్వాత!

ఆ చేపను బోటులోకి లాగే ప్రయత్నం చేసిన యర్రయ్యను ఆ మత్స్యం బలంగా వెనక్కు లాగింది. దాంతో ఎర్రయ్య తాడుతో సహా సముద్రంలోకి పడిపోయాడు. ఆ సమయం వారంతా తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో వేట సాగిస్తున్నారు. అంతలోనే సుమారు 100 కిలోల బరువుండే కొమ్ముకోనాం చేప చిక్కింది. కానీ,అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక లో విషాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్ళిన మత్స్యకారుడిని ఒక చేప లాక్కెళ్ళిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఎర్రయ్య …

Read More »

రాయచోటిలో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాల అరెస్ట్.. ఇళ్లలో ఉన్న వాటిని చూసి కంగుతిన్న పోలీసులు..

గత రెండు రోజులుగా అన్నమయ్య జిల్లా రాయచోటి లోని కొత్తపల్లి ప్రాంత ప్రజలు హడలెత్తిపోతున్నారు. వారి మధ్య మామూలుగా తిరిగిన ఇద్దరు మనుషులు ఉగ్రవాదులు అని తెలిసేసరికి స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గత రెండు రోజుల క్రితం ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకోవడంతో టెర్రరిస్టుల ఉనికి బయటపడింది.అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ప్రాంతంలో ఉగ్రమూకల కదలికలను గుర్తించిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్‌ …

Read More »

వామ్మో.. ఇదేం చేపరా సామీ.. ఏకంగా పడవంతుంది..! 

అయితే, ఇలాంటి టేకు చేప చిన్నది అయితే మార్కెట్లో అమ్మకాలు జరిపి, వాటాలు వేసి తీసుకుంటూ ఉంటారు. అదే అతి భారీ టేకుచేప అయితే ఎక్కువగా మెడిసిన్ తయారీకి ఉపయోగపడుతుంది. క్యాన్సర్లు,గుండెపోటు నివారణకు దీనిని ఆహారంగా తీసుకుంటారని యానాం మత్స్యశాఖ అసి స్టెంట్ డైరెక్టర్ దడాల గొంతెయ్య తెలిపారు… ఇలాంటి చేపలు అరుదుగా దొరకడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.మత్స్యకారులకు జీవనాధారం ఆ గంగమ్మ తల్లి ఒడి..ఆ దేవత వారిని ఎప్పుడు, ఏ విధంగా కరుణిస్తుందో.. ఎప్పుడు వరాలు కురిపిస్తుందో తెలియదు. వేటకు వెళ్ళిన …

Read More »

ఐదేళ్లకే రైలెక్కి తప్పిపోయాడు.. కట్ చేస్తే.. 32 ఏళ్ల తర్వాత జరిగిన సీన్ ఇది!

ఐదేళ్ల వయసులో రైలెక్కి వెళ్లిపోయాడో కుర్రాడు.. సీన్ కట్ చేస్తే 32 ఏళ్లకు తల్లిదండ్రుల ఆచూకీ వెతుక్కుంటూ సొంత ఊరికి తిరిగొచ్చాడు. అప్పటికే తల్లిదండ్రులు చనిపోయారని తెలిసి కన్నీరు పెట్టుకున్నాడు.. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ రియల్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్ట్‌లు ఉన్నాయి. ఆదోని వెంకన్నపేటలో తండ్రి జనార్దన్, తల్లి, నానమ్మ రామాంజనమ్మతో కలిసి ఉండేవాడు వీరేష్. అయితే, తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ పొరపాటున రైలెక్కి తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లానని చెబుతున్నాడు. అలా మూడేళ్ల వయసులో చెన్నై వెళ్లిన …

Read More »

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఎగిసిపడ్డ మంటలు

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయం సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా షాప్‌ మొత్తం విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. రెండు షాపులు గద్ధమయ్యాయి. భారీ అగ్ని కీలలు ఎగిసిపడటంతో స్థానికులతోపాటు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బుధవారం(జూలై 03) తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కి …

Read More »

ఈ విషయం తెలుసా… కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు షురూ

కర్నూల్‌ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అత్యధిక ఒత్తిడి ఈ విమాన సర్వీస్‌పైనే ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు .ఏపీలో విమాన సర్వీసులు ప్రయాణికులకు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూల్ టు విజయవాడ విమాన సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర విమానాయానశాఖమంత్రి రామ్మోహన్‌నాయుడు. ఇప్పటికే కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్నూల్‌ నుంచి విజయవాడకు …

Read More »

వాన వాన వెల్లువాయే.. తెలుగు రాష్ట్రాలు మురిసిపాయే.. ఈ జిల్లాలకు

ఆంధ్రప్రదేశ్‌లో రోజంతా మేఘాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తూ ఉంటుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణలోని 19 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ద్రోణి ఆగ్నేయ రాజస్థాన్ నుండి వాయువ్య బంగాళాఖాతం …

Read More »

కుప్పానికి జల కళ వచ్చేసిందోచ్‌.. వరాలు కురిపించిన సీఎం చంద్రబాబు!

కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 1292.74 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రారంభించారు. హంద్రీనీవా ప్రాజెక్టు, సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లు, గ్యాస్ కనెక్షన్లు, పెన్షన్లు, రోడ్లు, తాగునీరు వంటి పలు అంశాలపై దృష్టి సారించారు. గత ప్రభుత్వాలను విమర్శిస్తూ, సుపరిపాలనపై దృష్టి పెడుతున్నామని ప్రకటించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తన నియోజకవర్గం కుప్పంలో పలు అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రారంభించారు. ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమంలో భాగంగా సీఎం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.1292.74 …

Read More »

వేసవి చివరిలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. జూన్‌లో ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా

ఆపదమొక్కుల వాడు కోనేటి రాయుడు మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూన్ నెలలో సగటున 80వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది. అవును జూన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో లభించిందని టీటీడీ ప్రకటించింది.తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం కూడా ఇప్పుడు అంతకంతకు పెరుగుతుండటమే నిదర్శనం. తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారిపోవడంతో …

Read More »