ఆంధ్రప్రదేశ్

హాలో ఆంధ్రా.. అనకాపల్లిలో మరోసారి ప్రధాని ఆవాజ్‌.. ఎప్పుడంటే..?

మూడోసారి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి విశాఖకు రాబోతున్నారు. మోదీ పర్యటనతో ఏపీవాసుల పదేళ్ల కల నెరవేరబోతోంది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అభివృద్ధి కార్యాక్రమాల్లో పాల్గొంటారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన దాదాపు ఖరారైంది. జనవరి ఎనిమిదిన ప్రధాని మోదీ అనకాపల్లి వస్తారని పార్లమెంటు సభ్యులు సీఎం రమేశ్ ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్.. సహా …

Read More »

టెన్త్‌ విద్యార్ధులకు అత్యధిక మార్కులు వచ్చేలా.. వంద రోజుల ప్రణాళిక అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు మార్చి నెలలో జరగనున్న పబ్లిక్ పరీక్షల కోసం సర్కార్ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. పరీక్షల్లో విద్యార్ధులు అత్యుత్తమ మార్కులు సాధించేలా అదనపు తరగతులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుంచి …

Read More »

ఏపీలో కొత్త సంవత్సరంతో పాటే మారనున్న డీజీపీ, సీఎస్‌.. మరి ఈ లిస్ట్‌లో ఉన్నది ఎవరు..?

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌తో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు డిసెంబర్ నెలాఖరుతో రిటైర్ కాబోతున్నారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే సీనియర్ల లిస్టును పరిశీలించిన ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే సీఎం చంద్రబాబు పాతవారికే మరో అవకాశమిస్తారా? లేక ఎవరైనా కొత్తవారిని తీసుకొస్తారా? అనే ఆసక్తి నెలకుంది.ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సంవత్సరంతో పాటే.. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు కూడా రానున్నారు. ప్రస్తుత సీఎస్‌ …

Read More »

18 యేళ్ల తర్వాత.. జైలు నుంచి విడుదలైన పరిటాల రవి హత్య కేసు నిందితులు

18 యేళ్ల క్రితం టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. నాటి కేసులో నిందితులుగా తేలిన వారికి కోర్టు జైలు శిక్ష విధించగా.. వారంతా కడప సెంట్రల్ జైలులో నాటి నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వారిలో ఐదుగురు నిందితులు శుక్రవారం (డిసెంబర్ 20) జైలు నుంచి విడుదలయ్యారు..మాజీ మంత్రి, టీడీపీ దివంగత నేత పరిటాల రవి హత్యకేసులో నిందితులు శుక్రవారం (డిసెంబర్‌ 20) జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో నిందితులకు శిక్ష …

Read More »

గుడ్‌న్యూస్.. ఏపీకి రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు.? ఏ రూట్‌లోనంటే.!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు రూట్లలో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇక ఇప్పుడు ఏపీకి మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు రానున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉండగా.. అవి ఏయే రూట్లలో ఇప్పుడు తెలుసుకుందామా..ఏపీ ప్రజలకు త్వరలోనే గుడ్‌న్యూస్ అందనుంది. రాష్ట్రంలో మరో రెండు వందేభారత్ రైళ్లు పట్టాలెక్కే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ప్రయాణీకుల రద్దీ పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రూట్లలో కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని పలువురు ఎంపీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఇక వాటిల్లో కొన్నింటికి …

Read More »

 యూజీసీ నెట్‌ 2024 (డిసెంబర్‌) పరీక్షల తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే

జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, పీహెచ్‌డీ ప్రవేశాలకు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించే యూజీపీ నెట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా యమ డిమాండ్ ఇంటుంది. అందుకే ప్రతీయేట ఈ పరీక్షను రెండు సార్లు యూజీపీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్షల తేదీలను ఇప్పటికే యూజీపీ ప్రకటించింది. అయితే ఈ తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి..యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్ష తేదీలు మారాయి. …

Read More »

ఏపీకి వాయుగండం ముప్పు..! ఇక నాన్‌స్టాప్ వర్షాలే.. వర్షాలే.. రాబోయే 3 రోజుల వాతావరణ సూచనలివే..

ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు శుక్రవారం రాబోవు మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై ప్రకటన విడుదల చేసింది..బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని …

Read More »

ఇంటికి పార్శిల్ వచ్చిందని తెరిచి చూస్తే.. గుండె ఆగినంత పనైంది..

ఏదైనా వస్తువును మనం ఆన్లైన్లో గాని, ఇతరత్రా మాధ్యమాల ద్వారా బుకింగ్ చేసుకున్నప్పుడు పార్సిల్ మన ఇంటి దగ్గరికే వస్తుంటాయి. కొందరైతే ఆ పార్సెల్ ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, సడన్ గా ఓ ఇంటికి ఓ పార్సెల్ వచ్చింది. ఆత్రుతగా ఆ పార్సిల్ ఓపెన్ చేశారు. ఇంకేముంది గుండె ఆగినంత పనైంది..ఏదైనా వస్తువును మనం ఆన్లైన్లో గాని, ఇతరత్రా మాధ్యమాల ద్వారా బుకింగ్ చేసుకున్నప్పుడు పార్సిల్ మన ఇంటి దగ్గరికే వస్తుంటాయి. కొందరైతే ఆ పార్సెల్ ఎప్పుడు వస్తుందా..? …

Read More »

కొండపై పాలిటిక్స్‌కి నో.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్

టీటీడీ తిరుమల వెంకన్న క్షేత్రంలో పాలిటిక్స్‌కు చోటు లేదంటుంది. రాజకీయ నాయకులు తిరుపతి వచ్చి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని టీటీడీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయంగా వ్యాఖ్యలు చేసిన టీటీడీ సహించేది ముక్తకంఠతో చెబుతుంది.తిరుమల వెంకన్న క్షేత్రంలో పాలిటిక్స్‌కు టీటీడీ నో ఛాన్స్ అంటోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే పొలిటికల్ లీడర్ల కామెంట్స్ పట్ల టీటీడీ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయంగా వ్యాఖ్యలు చేసిన టీటీడీ సహించేది …

Read More »

వాడు కన్నేస్తే  జాకెట్లే మాయం.. ఆరు నెలలుగా జాకెట్లు దొంగలిస్తున్న వెరైటీ దొంగ !

ఓ వ్యక్తి మహిళల రవికెలు(జాకెట్లు) అపహరించడం అందర్నీ అశ్చర్యానికి గురిచేసింది. ఆ వింత దొంగని పోలీసులు పట్టుకున్నారు. అసలు ఎందుకు ఇలా జాకెట్లు దొంగతనం చేశావు అని పోలీసులు ప్రశ్నించగా, అది తన బలహీనత అంటూ కాళ్లపై పడ్డాడు. ఏం కేసు పెట్టాలో ఏంటో తెలియక పోలీసులు నిందితుడుకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.దొంగతనం అరవై ఆరు కళల్లో ఒకటి.. శ్రీ క్రృష్ణుడు సైతం గోపికల వస్త్రాలు అపహరించేవాడు. గోపికలతో ఆడుతూ వారిని ఆటపట్టించేవారట. ఇలాంటి సరదా సన్నివేశాలు చాలా సినిమాల్లో నది గట్టుపై తమ …

Read More »