ఆంధ్రప్రదేశ్

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులపాటు పిడుగులతో భారీ వర్షాలు!

వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో పాటుగా మరోక ద్రోణి కూడా విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ …

Read More »

పీజీసెట్‌లో 93.55 శాతం ఉత్తీర్ణత.. ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి …

Read More »

అక్కడున్నది CBN..! ఇది కదా అద్దిరిపోయే స్వీట్ న్యూస్.. ఏపీకి ఇక సొంతంగా

విజన్-2047 దృష్టిలో పెట్టుకుని ఏపీలోని అమరావతిని వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ సిటీస్ ఇన్ ఇండియాగా తీర్చిదిద్దుతున్నారు సీఎం చంద్రబాబు. ఆయన విజన్ నుంచి వచ్చినదే ఈ ‘అమరావతి క్వాంటం వ్యాలీ’.. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..అమరావతి క్వాంటం వ్యాలీ – నేషనల్ వర్క్‌షాప్’ కర్టెన్ రైజర్ కార్యక్రమం బుధవారం ఉదయం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న ప్రసంగిస్తూ, క్వాంటం టెక్నాలజీతో కూడిన భవిష్యత్తు దిశలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయాణాన్ని వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. …

Read More »

ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. బనకచర్ల ప్రాజెక్టు పూర్తి కోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి వనరుల వినియోగాన్ని సమర్థంగా మలచేందుకు మరో కీలక అడుగు వేసింది. బనకచర్ల ప్రాజెక్టును స్థాపించేందుకు పునాది వేస్తూ ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా “జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్” అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అమరావతిని కేంద్రంగా చేసుకుని పనిచేయనున్న ఈ కంపెనీని 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద నీటిని పట్టుకుని, రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు …

Read More »

పోస్టాఫీసులో డబ్బును విత్‌డ్రా చేసేందుకు వెళ్లాడు.. తీరా పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా

పోస్టాఫీసుల్లో డబ్బులు దాచుకున్న ఖాతాదారుల సొమ్మును పక్కదారి పట్టిస్తున్న పోస్ట్‌మాస్టర్ల ఉదంతాలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగండ్ల, చెరుకూరు, నాగులపాలెం పోస్టాఫీస్‌ బ్రాంచ్‌లలో ఇటీవల ఇలాంటి మోసాలే వెలుగు చూసాయి. తాజాగా బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పూనూరు పోస్టాఫీస్‌లో పోస్టుమాస్టర్ నకిలీ పాసు పుస్తకాలతో ఖాతాదారులను మోసం చేసిన విషయం వెలుగు చూసింది.కష్టపడి సంపాదించుకుని పొదుపు చేసుకున్న సొమ్ము ఎవరో అప్పనంగా కొట్టేశారంటే ఎలా ఉంటుంది. చాలీచాలని సంపాదనలో కూడా రూపాయి రూపాయి కూడబెట్టి భవిష్యత్‌ అవసరాలకు …

Read More »

పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియలో అనుచిత పోస్టులు పెట్టిన పలువురిపై జనసేన నాయకులు, వపన్ ఫ్యాన్స్ పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ పై అనుచితంగా కామెంట్స్ చేసిన వారిని గుర్తించారు. …

Read More »

తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌..! బయటికొచ్చిన సంచలన నిజాలు

గద్వేల్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌లు బయటపడ్డాయి. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అరెస్టు అయ్యారు. తిరుమలరావు, ఐశ్వర్య కలిసి 75 వేల రూపాయలకు సుపారీ ఇచ్చి తేజేశ్వర్‌ను హత్య చేయించారని పోలీసులు తెలిపారు. ఐశ్వర్యకు తిరుమలరావుతో గతంలో సంబంధం ఉండేదని, తేజేశ్వర్‌ను హత్య చేసి తిరుమలరావుతో పారిపోవాలని ఐశ్వర్య ప్లాన్ చేసిందని దర్యాప్తులో తేలింది.తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు, ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే …

Read More »

మెగా డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. మరికొన్ని ఆన్సర్‌ ‘కీ’లు విడుదల..

రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జులై 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ తొలుత పూర్తైన పరీక్షల ఆన్సర్‌ కీలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. ఇప్పటికే డీఎస్సీ గణితం సబ్జెక్టుకు సంబంధించిన ఆన్‌లైన్‌ రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల చేయగా.. తాజాగా మరో రెండు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జులై 2వ తేదీ వరకు …

Read More »

ఉరుములు, మెరుపులతో అల్లకల్లోలం.. నేడు, రేపు జర భద్రం!

రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిక్కు నుంచి గాలులు వీయనున్నాయి. ఈ రోజు, రేపు, తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది..పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరంలో సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ జార్ఖండ్, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర …

Read More »

రాజధాని నిర్మాణానికి చేతి గాజులు విరాళంగా ఇచ్చిన మహిళ – అభినందించిన సీఎం చంద్రబాబు!

ఎన్నో ఎళ్లుగా ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్న రాజధాని అమరావతి నిర్మాణం సహకారం కానుంది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం నిర్మాణపునులను వేగంగా పూర్తి చేస్తుంది. అయితే రాజధాని నిర్మాణంలో తాము పాలుపంచుకుంటామని కొందరు ఏపీ ప్రజలు ముందుకొస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు సీఎం చంద్రబాబును కలిశారు. రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయంగా వారి చేతి గాజులను విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబును …

Read More »