ఆంధ్రప్రదేశ్

నిండా సరుకుతో హైవేపై దూసుకొచ్చిన కారు.. ఇంతలో పుష్ప మాదిరి ట్విస్ట్.. చివరకు జరిగిందిదే..

అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియా.. ఓ బొలెరో వాహనం దూసుకొస్తుంది.. బొలెరో వాహనం నిండా ఏవోవో సరుకుల బస్తాలున్నాయి.. పోలీసులకు ఏదో అనుమానం కలిగింది.. దీంతో వారిని ఆపారు.. కానీ.. వాహనంలో ఉన్న వారు టెన్షన్ తో వాహనం స్పీడును మరింత పెంచారు.. అలా వాహనం స్పీడుగా ఉన్న క్రమంలోనే.. బొలెరో నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసులు వారిని పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో సినీ ఫక్కీలో గంజాయి …

Read More »

నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ జల సవ్వడి…క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల..ఎన్ని గేట్లు ఎత్తారంటే..

నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణమ్మ ఉరకలేస్తోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ కృష్ణా పరివాహ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ జలకల సంతరించుకుంది. దీంతో 26 క్రస్ట్ గేట్ల మీదుగాకృష్ణమ్మ జాలువారుతోంది. కృష్ణవేణి జల సవ్వడి డ్రోన్ విజువల్స్ చూశారా…? ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు కృష్ణ బేసిన్ లోని రిజర్వాయర్లన్నీ ఇప్పటికే నిండాయి. జూలైలో ముందస్తుగా ఆల్మట్టి నుండి శ్రీశైలం వరకు అన్ని జలాశయాలు …

Read More »

అమరావతి క్వాంటం వ్యాలీకి సింగపూర్‌ కంపెనీల పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు

సింగపూర్‌లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు సింగపూర్‌లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరై తమ అభిప్రాయాలను తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకించి విశాఖలో దీనికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సింగపూర్‌లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం ఆ …

Read More »

గండికోట రహస్యం.. విద్యార్థిని హత్య జరిగి 18 రోజులు.. తాజా అప్ డేట్స్ ఇవి..!

గండికోట రహస్య వీడేదెప్పుడు? ఇంటర్ స్టూడెంట్ వైష్ణవి హత్య జరిగి 18రోజులైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. కోట చుట్టూ కొండ చుట్టూ కలియతిరుగుతున్నారు. బట్.. ఎలుకను కూడా పట్టుకోలేకపోతున్నారు. ఎందుకిలా? అసలీ కేసును పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారా? అందులో భాగంగానే సాగ దీస్తున్నారా? టెక్నాలజీ మీద భారం వేసి చేతులెత్తేస్తారా? కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం గండికోటలో వైష్ణవి హత్యకు గురయింది. గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈనెల 14న జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్‌కి చేరుకుని మృతదేహాన్ని …

Read More »

అమెరికాలో ఉద్యోగం అనగానే లక్షలు అప్పజెప్పారు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ఉద్యోగాల పేరుతో ఎంతో మంది లక్షలు కాజేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం దాన్ని నమ్మి యువత పైసలు కట్టడం.. ఆ తర్వాత మోసపోయామని తెలిసి లబోదిబో అనడం. చివరకు పోలీసులను ఆశ్రయించడం. ఇటువంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా మోసగాళ్ల మాటలకు ఇంకా చాలా మంది బలవుతూనే ఉన్నారు. ఇమ్మిగ్రేషన్‌లో ఉద్యోగం అది అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందంటూ ప్రచారం చేశారు. ఇది నమ్మి ముగ్గురు అక్కాచెల్లెళ్లు వచ్చారు. వారి వద్ద నుండి రూ.37 లక్షలను వసూలు చేశారు. ఆ …

Read More »

నేడు శ్రీహరికోట నుంచి GSLV-F16 రాకెట్ ప్రయోగం… నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో

మరొకొద్ది గంటల్లో శ్రీహరికోట నుంచి GSLV-F16 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం సాయంత్రం 5:40కి GSLV-F16 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన NISAR.. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్‌తో పనిచేసే ఉపగ్రహం. ఇది L -బ్యాండ్, S-బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్‌‎ను భూమికి పంపిస్తుంది. నిసార్‌కు పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో ఫొటోలను తీసే సామర్థ్యం …

Read More »

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రూ.11 కోట్లు సీజ్… రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. సిట్‌ అధికరుల సోదాల్లో ఏకంగా రూ.11 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. సులోచన ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్లు సీజ్ చేశారు సిట్‌ అధికారులు. A40 వరుణ్‌ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు నిర్వహించింది. 12 బాక్సుల్లో నగదు దాచినట్టు గుర్తించారు. ఏ1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు వరుణ్, చాణక్య అంగీకరించినట్లు తెలుస్తోంది. 2024 జూన్‌లో నగదు ఫామ్‌హౌస్‌కు తరలించారు. ప్రొఫెసర్ తగల బాల్‌రెడ్డి …

Read More »

 అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.

అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చింది. చిన్నారి శిశువులను అడ్డుపెట్టుకుని పశువులా బిజినెస్‌ చేసింది. అంగడి బొమ్మల్లా…పసికందులను అమ్మకానికి పెట్టింది. పిల్లలను షాపులో చాక్లెట్లు, బిస్కెట్లలా ట్రీట్‌ చేసింది. పైకి IVF, సరోగసీ అంటూ కవరింగ్‌ కలరింగ్‌ ఇచ్చి…అమ్మ కావాలనే ఆశలతో వచ్చినవాళ్ల జీవితాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంది. సంతలో సరుకుల లెక్కన శిశువులను అమ్మేసింది. అమ్మా అనిపించుకోవాలనే ఆవేదన. తండ్రి అని పిలిపించుకోవాలనే తపన. అలా పిలిపించుకోలేక తల్లడిల్లే వివాహిత జంటలే డాక్టర్‌ నమ్రత టార్గెట్‌. కళేబరాల కోసం రాబందులు కాచుకు కూర్చున్నట్లు.. పిల్లల కోసం …

Read More »

కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్.. టీడీపీ నేతలకు సినిమా చూపిస్తామన్న జగన్..

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తలు, సీనియర్ నేతలపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ వేధింపులకు సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎవరైన వేధిస్తే కార్యకర్తలు ఈ యాప్‌లో ఆ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార – విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. వేధింపులకు గురిచేస్తున్నారనేది వైసీపీ వాదన. తాము …

Read More »

డిగ్రీ విద్యార్ధులకు అలర్ట్.. ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌లలో ఇంటర్న్‌షిప్‌లు రద్దు..! ఇక 6వ సెమిస్టర్‌లోనే..

రాష్ట్రంలోని డిగ్రీ విద్యా విధానంలో ఉన్నత విద్యా మండలి కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకూ డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ వేసవి సెలవుల్లో కమ్యూనిటీ ప్రాజెక్టు, సెకండ్‌ ఇయర్‌లో 2 నెలలు, ఫైనల్‌ ఇయర్‌లో 5, 6 సెమిస్టర్లలో ఇంటర్న్‌షిప్‌లను అమలు చేస్తున్నారు. ఈ మూడేళ్లలో 10 నెలల ఇంటర్న్‌షిప్‌నకు మొత్తం 20 క్రెడిట్లు ఇచ్చేవారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి.. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి …

Read More »