విజయవాడలోని సత్యనారాయణ పురం పోలీసుల స్టేషన్ పరిధిలో ఒకే రోజు రెండు చోరీలు జరగడం స్థానికులను తీవ్ర భయాదోంళనకు గురిచేస్తోంది. ఇంటి యాజమానులు విదేశాలకు వెళ్లారన్న పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లోని బంగారం, నగలు ఎత్తుకెళ్లారు. ఉదయం పనిమనిషి వచ్చి చూడగా ఇంటి తలుపు తెరిచి ఉండడంతో యజమానికి సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ మధ్య కాలంలో దొంగతనాలు, దొపిడీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొందరు …
Read More »కల్తీ నెయ్యి కేసులో అక్రమాలు బట్టయలు.. తిరుమలతోపాటు ప్రసిద్ధ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా!
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకూ భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. తిరుపతిలో డెయిరీకి కమీషన్లు చెల్లించి ఆ …
Read More »అబ్బ.. చల్లని కబురు వచ్చేసింది.. 3 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు అలెర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:- …
Read More »దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై కొండపైకి వెళ్లకుండానే దర్శన టికెట్లు పొందొచ్చు!
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఇకపై ఆలయ పరిసరాల్లోనే కాకుండా, బస్స్టేషన్, రైల్వే స్టేషన్లలోనూ భక్తులకు అమ్మవారి దర్శన టికెట్లను అందుబాటులో ఉంచే విధంగా దేవస్థాన కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా భక్తుల విజ్ఞప్తి మేరకు విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, తారాపేట మాడపాటి గెస్ట్ హౌస్, వన్ టౌన్ జమ్మి దొడ్డిలలో దేవస్థానం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం …
Read More »బహిరంగ క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే.. ఎందుకంటే!
ఇంటింటికి పార్థసారథి కార్యక్రమంలో భాగంగా ఈనెల 16న కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్ను అవమానించాననే ఆరోపణలపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. తానకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. తెలియకుండా తానేవరినైనా బాధపెట్టి ఉంటే బహిరంగ క్షమాపణలు చెబుతున్నాని ఆయన అన్నారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆదోని నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పార్థసారథి. ఈ క్రమంలో ఈయన తాజగా ఇంటింటికి పార్థసారథి అనే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా …
Read More »అగరబత్తులపై 60 యోగాసనాలు.. ఆయన ట్యాలెంట్ చూస్తే మతి పోవాల్సిందే!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు కోటేష్ అగరబత్తులపై 60 యోగా ఆసనాలను గీసి అందరినీ అబ్బురపరిచాడు. యోగా అనేది ప్రతి ఒక్కరి దిన చర్యలో ఒక భాగం కావాలనే సందేశంతో చిత్రకారుడు కోటేష్ గీసిన ఆసనాల చిత్రాలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఓ టాలెంట్ ఉంటుంది. అలాంటి వారు తమ ప్రతిభతో ఎప్పటికప్పుడు అద్భుతాలు సృష్టిస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తూ ఉంటారు. తాజాగా నంద్యాల పట్టణానికి చెందిన ఓ చిత్రకారుడు కోటేష్ సైతం తన చిత్రకళతో …
Read More »పోలీస్ ఆఫీస్ ఎదుట సూర్య నమస్కారాలు..ఆకట్టుకుంటున్న శిల్పాలు.. ఆవిష్కరించిన ఎస్పీ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపిలో ప్రతి చోట యోగాసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వినూత్న ఆలోచనకు రూపం వచ్చింది. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లే ముందు ఖాళీ స్థలం ఉంది ఎంతో కాలంగా అక్కడ మట్టి పేరుకుపోయి ఉంది. అయితే ఎస్పీ సతీష్ కుమార్ అక్కడ అరుదైన శిల్పాక్రుతిని ఏర్పాటు చేయాలని సంకల్పించారు.పోలీసులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు ప్రతి రోజూ డ్రిల్ చేస్తుంటారు. అయితే పని ఒత్తిడి కారణంగా ప్రతి రోజూ లా అండ్ …
Read More »కొట్లాడితే ఏమొస్తుంది.. కూర్చుని మాట్లాడుకుంటే పోలా.. బేసిన్లో నీళ్లకు భేషజాలు ఎందుకు?: సీఎం రేవంత్
కొట్లాడుకుంటే ఏమొస్తుంది? కూర్చుని పరిష్కరించుకుంటే సరిపోద్ది కదా. బేషజాలకు పోతే ఏమొస్తుంది. బేసిన్ల లెక్కలు తేల్చుకోవడమే కదా కావాల్సింది. రండి.. మాట్లాడుకుందాం.. నీటి వాటాలపై క్లారిటీకి వద్దామంటూ.. ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీ ఏదైనా ఉందంటే.. అది జల జగడమే. గోదావరి, కృష్ణా నదిపై ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో మొదటి నుంచీ వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏపీ బనకచర్ల ప్రతిపాదనతో జల జగడం మరింత ముదిరింది. ఈ ప్రాజెక్ట్తో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి …
Read More »యోగా.. యావత్ భారతావనికి దక్కిన గౌరవం.. యోగా సాధకులు మాత్రమే ఒత్తిడిని జయించగలరు- పవన్ కల్యాణ్!
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం యోగాలో పాల్గొనే వారి కోసం ఆర్కేబీచ్ నుంచి భీమిలి వరకు అనే కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసింది. ఇక ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా సంఖ్యలో జనం తరలివచ్చారు. ఇక ఈ …
Read More »రికార్డులు ఏవైనా మోదీకే సాధ్యం.. యోగా మన జీవితంలో భాగం..
11వ అంతర్జాతీయ యోగాడే రికార్డు నెలకొల్పబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. 12 లక్షల ప్రాంతాల్లో ఇవాళ యోగా చేస్తున్నారన్నారు. అలాగే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది యోగా చేస్తున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయన్నారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంతో రికార్డు సృష్టించినట్టు చెప్పారు. నిన్న 22వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారన్నారు. ప్రతిరోజూ గంటసేపు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని.. …
Read More »