శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ ఆదాయం భారీగా పెరిగింది. విదేశీ కరెన్సీ హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతుంది. రూ.5,96,92,376 కోట్ల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 26 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించారు.నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా …
Read More »పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. కూటమి సర్కార్ సీరియస్ యాక్షన్..
రేషన్ రైస్ మిస్సింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. తాము తప్పు చేయలేదు కాబట్టే బియ్యం మాయంపై లేఖరాశామన్నారు పేర్నినాని. అడ్డంగా దొరికిపోయాక బుకాయించడం దేనికని ప్రశ్నిస్తోంది అధికారపార్టీ. పేదల బియ్యాన్ని బుక్కినవారినెవ్వరనీ వదిలే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం మెడకు రేషన్ బియ్యం వివాదం చుట్టుకుంది. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో నాని సతీమణి పేరుతో ఉన్న గోడౌన్లో బియ్యం మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో …
Read More »నిరుద్యోగులకు అలర్ట్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. యేటా వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారీగా క్లర్క్ ఉద్యోగాల కోసం మరోమారు ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 17వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు..దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనల కోసం ఏటా లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఎస్బీఐ …
Read More »లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్ పిల్లల సమ్మెటివ్ 1 మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ లీక్! పరీక్ష వాయిదా
ఇప్పటి వరకూ క్వశ్చన్ పేపర్ల లీకేజీలు కాలేజీ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విస్తరించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి ఘట్టం కూడా పూర్తించారు లీకు రాయుళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న సమ్మెటివ్ 1 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సమ్మెటివ్ 1 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం (డిసెంబర్ 16) గణిత సబ్జెక్ట్ పరీక్షలు జరిగాయి. అయితే పరీక్ష సోమవారం ప్రారంభంకాక ముందే గణితం ప్రశ్నపత్రాలు లీక్ …
Read More »శతాబ్దాల చరిత్రకు కొత్త సొగసులు.. గువ్వలకుంట్ల మెట్లబావికి పూర్వవైభవం
దశాబ్దాలుగా చెత్తాచెదారంతో నిండిపోవటంతో బావి ఆనవాల్లే లేకుండా పోయిన పురాతన మెట్ల బావిని శుభ్రపరచి బావిలో దాగివున్న కళాఖండాలను వెలికి తీశారు. ఇప్పటికీ ఈ బావిలో ఉన్న శిల్ప కళా సంపద ఏమాత్రం చెక్కు చెదరలేదు.ఎన్నో వందల సంవత్సరాల పురాతన భావి చరిత్ర వెలుగులోకి వచ్చింది.. పూర్వీకులు ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిల్పకళా సంపద బయటి ప్రపంచానికి తెలిసింది. ఆత్మకూరు పట్టణానికి చెందిన యుగంధర్ అనే యువకుడు బావి దుస్థితి చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు ఆ వీడియోను కొందరు నారా …
Read More »బాబోయ్.! మళ్లీనా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి రెండు రోజులలో ఇది అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. మరో రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు తమిళనాడు, …
Read More »పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
పోలవరం పనులు ఇక పరుగులు పెట్టిస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వారం వారం ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తూ.. జెట్ స్పీడ్లో ప్రాజెక్ట్ను పూర్తిచేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం పనుల్లో వేగం పెంచింది. నిర్దిష్ట కాలపరిమితితో ప్రణాళికలు రూపొందించి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటివరకు …
Read More »ఇచ్చిన మాటకు కట్టుబడి మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆరు నెలలలోపే నేరవేర్చుకున్నారు. పిఠాపురంలో 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. …
Read More »బోడ కాకర కాయతో బోలెడు లాభాలు..తెలిస్తే బోరు అనకుండా తింటారు..!
బీడు భూములు, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. ముఖ్యంగా జూన్-జులై మాసాల్లో మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇక వీటి ధర చికెన్, మటన్ ధరతో పోటీ పడుతుందని చెప్పాలి. అలాంటి బోడ కాకరకాయ లాభాలు తప్పక తెలుసుకోవాల్సిందే..బోడ కాకర..ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయింది. కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకున్నారు. ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలు తీసుకోవటం అలవాటు చేసుకుంటున్నారు. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటున్నారు. వాటితో పాటు సేంద్రీయ ఉత్పత్తులు …
Read More »ఛీ.. ఛీ.. వీళ్ళు బంధువులా? లేక రాబందువులా? తల్లి అని కనికరం లేకుండా..
కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరిని కలచి వేస్తుంది. నవ మాసాలు మోసి కనిపించిన ఆ తల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయారు. వృద్ధురాలనే కనికరం కూడా లేకుండా కారులో తీసుకువచ్చి రోడ్డుపై వదిలేసి వెళ్లారు.వృద్ధులైన తల్లిదండ్రులను కొందరు మూర్ఖులు భారంగా భావిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసిన వారిని కూడా అనాధలుగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాల్సిన వారే తల్లిదండ్రుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన …
Read More »