ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల.. శరవేగంగా ఏర్పాట్లు!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పనుల్లో నిమగ్నమైంది. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీలోని అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించిన ఈఓ విస్తృత తనిఖీలతో సమాయత్తం చేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరిపేందుకు టీటీడీ సన్నద్దం అయ్యింది. బ్రహ్మోత్సవాలకు ఈ నెల 23 న అంకురార్పణ జరగనుంది. 24 న శాస్ట్రోక్తంగా ద్వజారోహణం జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 …

Read More »

తిరుమల శ్రీవారు ధరించే పూలమాలల.. వాటి ప్రత్యేక ఏంటో మీకు తెలుసా?

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. వెల కట్టలేని బంగారు నగలు, వజ్ర వైడూర్యల ఆభరణాలున్నఅలంకార ప్రియుడు. అంతటి బంగారు స్వామి సేవలో అనునిత్యం తరిస్తున్న సుగంధ పుష్ప మాలలు ఏంటో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. పుష్పాలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది. పవిత్రమైన తిరువాయ్‌ మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొన్నట్లు స్వామి వారికి నిత్య కైంకర్యాలలో సుగంధ వాసనలు వెదజల్లే ఎన్నో రకాల పుష్పాలు అర్చకులు వినియోగిస్తారు. ఆపాదమస్తకం వివిధ …

Read More »

ఆమెకు తరచూ తలనొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మెదడులో దాన్ని చూసి డాక్టర్లు షాక్

పరాన్న జీవులు ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని వైద్యులు అన్నారు. ఇవి వార్మ్‌ బ్లడెడ్‌ జంతువుల సజీవ కణజాలాన్ని తినేస్తూ జీవిస్తాయని అన్నారు. అవి శరీర గాయాల ద్వారా రోగి శరీరంలోకి వెళ్తాయని, సకాలంలో వైద్యం అందకపోతే అవయవాల్లోకి ప్రవేశించి ప్రాణాలకు ముప్పు.. ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. కొన్ని చికిత్సలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన ఆపరేషన్‌ నిర్వహించారు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. వైద్యులు శస్త్రచికిత్స చేసి మహిళ మెదడు నుంచి పరాన్నజీవిని తొలగించారు. తిరువూరుకు చెందిన 50 …

Read More »

అప్పుడే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలు వచ్చేశాయ్‌.. ఈసారి ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్‌!

రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలను విడుదల చేసింది. రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు(జనరల్, వొకేషనల్), కాలేజీలో చదవకుండా ప్రైవేట్‌గా హ్యూమానిటీస్ గ్రూప్‌లో పరీక్షకు.. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలను విడుదల చేసింది. రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు(జనరల్, వొకేషనల్), కాలేజీలో చదవకుండా ప్రైవేట్‌గా హ్యూమానిటీస్ గ్రూప్‌లో పరీక్షకు సిద్ధం అవుతున్న …

Read More »

పవిత్ర శ్రీశైలంలో పట్టుబడిన మద్యం బాటిల్లు, అధికారులు ఏం చేశారో తెలిస్తే షాక్”

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఆలయ నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.ఇందులొ భాగంగానే శ్రీశైలం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండేళ్లలో 43 కేసులలో పట్టుబడిన మద్యం 1,197 బాటిళ్లు 186 లీటర్ల నాటు సారాయి శ్రీశైలం మల్లమ్మ కన్నీరు వద్ద డంపింగ్ యార్డ్‌లో ట్రాక్టర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మద్యం సారా ఇతర మత్తు పదార్థాలను సేవించడం నిషేధించారు. దేవదాయ ధర్మదాయ చట్ట ప్రకారం ఆలయ పరిసరాల్లో వాటిని నిషేధిస్తూ అమలు …

Read More »

వైఎస్ఆర్ వారసుడు రాజారెడ్డే అని తేల్చేసిన షర్మిల

తన కొడుకే వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసుడు అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తను ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టకుండానే.. వైసీపీ ఇంతలా స్పందిస్తుంటే ఇది భయమా? బెదురా అనేది వాళ్లకే తెలియాలన్నారు. రాజారెడ్డి అని తన బిడ్డకు పేరు పెట్టింది వైఎస్సార్ అని షర్మిల చెప్పారు. ఇటీవల ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో  షర్మిల వెంట ఆయన తనయుడు కనిపిస్తూ ఉండటంతో..  అతని పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. తన కుమారుడు సమయం వచ్చినప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తాడని.. షర్మిల బహిరంగంగానే …

Read More »

కొత్త కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌.. కీలక సూచనలు జారీ!

రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 12 మంది కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు చంద్రబాబు. తన దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని.. అధికారులు కూడా అలాగే పని చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల ఎంపికలో అతనకున్న బెస్ట్ ఆప్షన్లలో మిమ్మల్ని ఎంపిక చేశానని ఆయన వెల్లడించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు, ఐఎఫ్ఎస్‌లు, ఐపీఎస్ లు బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో 12 …

Read More »

విజయవాడలో 115కి చేరిన డయేరియా కేసులు.. కలుషిత నీళ్లే కారణమా?

విజయవాడలో డయేరియా కేసుల పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఓవైపు బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తుంటే మరోవైపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. న్యూ రాజరాజేశ్వరి పేట వైద్య శిబిరంలో ఈ రోజు కొత్తగా మరో 5 గురు అడ్మిట్ అయ్యారు. దీంతో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో సచివాలయాల వారీగా.. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 115 కేసులు న‌మోదైనాయి. వీరిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 61 మంది. చికిత్స తీసుకొని మరో 54 మంది డిశ్చార్జ్ …

Read More »

రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌..! అక్టోబర్‌ 30 వరకే ఛాన్స్‌.. ఆ లోపు

ఆంధ్రప్రదేశ్‌లోని స్మార్ట్ రేషన్ కార్డులలో పేర్లు, వివరాలలో తప్పులు ఉన్నాయని తేలింది. దీంతో ప్రభుత్వం అక్టోబర్ 30 వరకు సవరణలకు అవకాశం కల్పించింది. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను సచివాలయాల్లో సరిచేసుకోవచ్చు. తప్పుల ను సరిదిద్దుకోవడానికి గడువును ప్రభుత్వం నిర్దేశించింది. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రేషన్‌ కార్డుల సందడి నెలకొంది. తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసింది రేవంత్‌ సర్కార్‌. దీంతో చాలా మంది లబ్ధిదారులు కొత్త రేషన్‌ కార్డులు పొందారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన …

Read More »

ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక ఇదే.. ఒక్కొక్కరికి రూ 15 వేలు..

ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా నేను చూసుకుంటాను. ఎంత యూరియా కావాలో అంతే వాడండి. మనం అడిగిన వెంటనే కేంద్రం యూరియా అందిస్తోంది అని హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా రైతులకు అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో అనంతపురంలో నిర్వహించిన NDA తొలి బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమిలో మూడు పార్టీల కార్యకర్తల స్పీడ్‌తో సపరిపాలనలో ఏపీ ప్రభుత్వాన్ని …

Read More »