ఆంధ్రప్రదేశ్

ఏపీలో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా ఉండబోతోంది. వాతావరణ సూచనలు ఏంటి.? వడగాల్పులు ఏయే జిల్లాల్లో వ్యాపించనున్నాయి. వర్షాలు ఏయే ప్రాంతాల్లో పడతాయి..? అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి. నిన్నటి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు అంతర్గత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దిగువ …

Read More »

విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్‌ సిలబస్, పరీక్ష విధానం మారుతుందోచ్‌..! కొత్త విధానం ఇదే

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పబ్లిక్‌ పరీక్ష విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటిని 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. మొదటిసారిగా ఇంటర్‌ విద్యలో ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు ఇంటర్‌ సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలో ఇంటర్మీడియట్‌ బోర్డు పలు మార్పులు చేసింది. ఈ మార్పుల వివరాలను తాజాగా జూనియర్‌ కళాశాలలకు పంపింది. ఇంటర్‌ మొదటి ఏడాదిలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని వచ్చే …

Read More »

సూరీడుతో జర జాగ్రత్త.. ఇవ్వాల్టి నుంచి చుక్కలేనట..! తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి.. దీంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది.. భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య.. వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఇవ్వాల్టి నుంచి భానుడు మరింత ప్రతాపం చూపిస్తాడని పేర్కొంది.. తెలంగాణలో వాతావరణం ఇలా.. దక్షిణ …

Read More »

మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. మరో 10 రోజుల్లోనే నోటిఫికేషన్‌

ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న రాష్ట్ర నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ మరో పది రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్‌ అనంతరం వెనువెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టి..ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్‌ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నోటిఫికేషన్‌ అనంతరం వెనువెంటనే భర్తీ …

Read More »

కొడాలి నానికి అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్య రావడంతో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. మంగళవారం రాత్రి కొడాలి నాని గ్యాస్ట్రిక్‌ సమస్యతో ఆస్పత్రికి వెళ్లారు. అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా , పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు …

Read More »

తల్లిదండ్రులకు అలర్ట్.. నవోదయా, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల ఫలితాలు వచ్చేశాయ్‌..! డైరెక్ట్ లింక్ ఇదే

దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన లాటరీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇందుకు సంబంధించి విద్యార్ధుల ఎంపిక జాబితా తాజాగా విడుదలైంది. మార్చి 7 నుంచి 21వరకు ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు మీ పిల్లలు ఎంపిక జాబితా తెలుసుకొనేందుకు కేవీ సంఘటన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను దరఖాస్తు చేసిన సమయంలో వినియోగించిన మొబైల్‌ నంబర్‌/ఈ-మెయిల్‌కు వచ్చిన లాగిన్‌ కోడ్‌, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌, క్యాప్చా …

Read More »

ఇక విద్యార్థుల సెల్‌ఫోన్లకే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. మంత్రి లోకేశ్‌ వెల్లడి

మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానిస్తున్నట్లు మంత్రి లోకేష్‌ శాసనసభలో తెలిపారు. ఈ ఏఐ ఆధారిత మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను జూన్‌ 30 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని, దీని ద్వారా వాయిస్‌ సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. దీనిద్వారా టెన్త్, ఇంటర్‌ విద్యార్థులు ఇంటి నుంచే ..ఏఐ ఆధారిత మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను జూన్‌ 30 నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని, దీని ద్వారా వాయిస్‌ సేవలు అందిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా …

Read More »

మండే వేసవిలో చల్ల చల్లని కబురు.. ఆ ప్రాంతాలకు జోరున వర్షాలు..

ఏపీలో వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. వచ్చే మూడు రోజుల్లో వాతావరణం ఇలా ఉండనుందని వైజాగ్ వాతావరణ కేంద్రం తెలిపింది. మండుటెండల్లో వర్షాలు పడనున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.! ఓ సారి ఇక్కడ లుక్కేయండి మరి.ఉపరితల ద్రోణి, ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో నైరుతి, …

Read More »

దేశంలోని ప్రతీ రాష్ట్ర రాజధానిలో తిరుపతి వెంకన్న ఆలయం! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఈ మేరకు దిశానిర్దేశం చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించినట్లయితే ఈ ప్రాజెక్టు అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని, శ్రీవారి ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆదేశించారు.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా …

Read More »

అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫైర్..

ప్రజల పక్షాన పనిచేసేందుకు అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు దండగ అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారని చంద్రబాబు, స్పీకర్‌ విమర్శిస్తే..తెలంగాణలో కేసీఆర్ తీరును ఎండగట్టారు సీఎం రేవంత్. ఆ వివరాలు ఇలా..ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు.. వారుకూడా ఒకవిధంగా ప్రభుత్వ ఉద్యోగులే.. ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రతి నెలా జీత భత్యాలు తీసుకునే వారు ఎన్నుకున్న ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఎలా? అనే ప్రశ్న అసెంబ్లీలో లేవనెత్తారు సీఎం చంద్రబాబు, …

Read More »